Publish Date:Jul 21, 2022
అంతా కేంద్రం అనుకున్నట్లే జరిగింది. విపక్షాలు ఊహించిన అద్భుతమేమీ జరగలేదు. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. తిరుగులేని మెజారిటీతో ఆమె విజయం ఓట్ల లెక్కింపునకు ముందే ఖరారైంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఆమె మొత్తం 64శాతం ఓట్లు సాధించిట్లు తేలింది. ఎంపలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ద్రౌపది ముర్ముకు ఆరు లక్షల 76 వేల 803 ఓట్లు దక్కాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మూడు లక్షల 80 వేల 117 ఓట్లు లభించాయి.
ఇప్పటి వరకూ దేశ రాష్ట్రపతులలో ద్రౌపది ముర్ముయే అతి పిన్న వయస్కురాలు. ఇలా ఉండగా ఓట్ల లెక్కుంపు మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికే ఆమెకు 53శాతం ఓట్లు దక్కడంతో ఆమె విజయం ఖరారైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించి ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా విపక్షాలు ఆశించినట్లుగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అయితే అది విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా కాకుండా ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు అనుకూలంగా జరిగింది.
విపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ముఖ్యంగా అసోం, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని భావిస్తున్నారు. విశేషమేమిటంటే బీజేపీకి కానీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కానీ అసలు ప్రాతినిథ్యమేలేని ఏపీలో మర్ముకు వంద శాతం ఓట్లు లభించాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూడా ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు పలికి ఆమెకే ఓటేశారు. ముర్ము తిరుగులేని విజయం అనంతరం తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉంటుందని ప్రకటించారు. దాంతో ఉప రాష్ట్రపతిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది.
రాష్ట్రపతి ఎన్నిక ఫలితం వెలువడగానే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులు ఆజాదీగా అమృతోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో తూర్పు భారత దేశంలోని మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా ఎన్నుకుని చరిత్ర దేశం చరిత్ర సృష్టించిందని మోడీ ట్వీట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/murmu-elected-as-president-of-india-25-140266.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.