Publish Date:Oct 20, 2021
అత్తను కొట్టి కోడలు లబోదిబోమంటూ అరిచిందట. ఇదో సామెత. కానీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరు ఇలానే ఉందంటూ మండిపడుతున్నారు. టీడీపీ ఆఫీసులపైపడి వైసీపీ రౌడీ మూకలు దాడులకు తెగబడ్డారు. కర్రలు, రాడ్లు, సుత్తిలతో విధ్వంసం సృష్టించారు. కార్యాలయ సిబ్బంది తలలు పగలగొట్టారు. ఇంతా చేసి.. అడ్డుకోబోయిన టీడీపీ నాయకులపై తిరిగి కేసులు పెట్టడం ఏపీ పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనం అంటున్నారు. వాళ్లు పోలీసులా? వైసీపీ కార్యకర్తలా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది పోలీసుల తీరు అంటున్నారు. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా మరికొందరికిపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి అనంతరం అక్కడికి వచ్చిన సీఐ నాయక్పై దాడి చేశారంటూ వారిపై అభియోగాలు మోపారు. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
సీఐ నాయక్పై దాడి చేశారంటూ నమోదు చేసిన కేసుల్లో.. ఏ-1గా నారా లోకేశ్, ఏ-2గా అశోక్బాబు, ఏ-3గా ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రవణ్ కుమార్, ఏ-5గా పోతినేని శ్రీనివాసరావు సహా మరికొందరిపై కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది.
ఎప్పటి నుంచో నారా లోకేశ్ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందనే ఆరోపణ ఉంది. ఇటీవల గుంటూరు జిల్లాలో అత్యా-చార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆమె ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసిన నారా లోకేశ్ను మధ్యలోనే అడ్డుకొని.. బలవంతంగా స్టేషన్కు తరలించారు. కేసులతో భయపెట్టాలని చూశారు. తాజాగా, టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో బాధితులపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం.. నారా లోకేశ్ను టార్గెట్ చేయడమేనంటున్నారు. లోకేశ్ను అరెస్ట్ చేస్తారా? అనే అనుమానమూ వ్యక్తమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/murder-attempt-and-atrocity-case-on-nara-lokesh-25-124866.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.