Publish Date:Jul 22, 2022
తిరుమల తిరుపతి అనగానే భక్తి పారవశ్యంలో మునుగుతారు జనం. ప్రతీ ఏడూ వెంకన్నను దర్శనా నికి వెళ్లకుంటే తోచని జనాలున్నారు. అక్కడంతా భక్తి, సామరస్య భావన తప్ప మరోటి ఎన్నడూలేదు. తిరు మల అంటేనే సామాజిక సామరస్యానికి, ప్రశాంతతకి ప్రతీక. ఎంతో కట్టుదిట్టమైన రక్షణవ్యవస్థనే గమని స్తుంటాం. పిల్లలు తప్పిపోయినా తమవద్దకు చేర్చగల పోలీసు వ్యవస్థ ఉంది. అలాంటి వెంకన్న సన్నిధిలో ఏకంగా హత్య జరగడం యావత్ తెలుగు లోకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తిరుమ కొండపై హత్య జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలం రేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం దగ్గర వ్యక్తి మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు.
తిరుమలలో హత్య తో ఒక్కసారిగా కలకలంరేగింది. ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా బండ రాయితో మోది హత్య చేశారు. అయితే ఈ దారుణానికి చిన్నపాటి గొడవ కారణమని తిరుమల వన్ టౌన్ పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఆరణి జిల్లాకు చెందిన కె.శరవణన్, వేలూరుకు చెందిన భాస్కర్ ఇద్దరూ తిరుమలలో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. అయితే రాత్రిళ్లు అక్కడే పడుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్థానిక మ్యూజియానికి ఎదురుగా వయోవృద్ధుల టిక్కెట్ల పంపిణీ కేంద్రం దగ్గర భాస్కర్ వచ్చి పడుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత శరవణన్ అక్కడికి వచ్చి తన చోటులో ఎందుకు పడుకున్నావంటూ గొడవపడ్డాడు. బలవంతంగా భాస్కర్ను అక్కడి నుంచి పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న భాస్కర్ శరవణన్పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సిమెంట్ రాయిని తీసుకొచ్చి నిద్రపోతున్న శరవణన్ తలపై మోదాడు. తీవ్ర గాయాలైన అతడు చనిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది.. తర్వాత హత్య ఉదంతం బయటపడింది.. మృతదేహం కనిపించింది. అనంతరం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అర్థ రాత్రి ఘటన జరిగినట్లు గుర్తించారు.
పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భాస్కర్ను అరెస్ట్ చేశారు. అయితే తిరుమలలో హత్య జరగడం హాట్ టాపిక్ అయ్యింది. తిరుమలలో ఎవరైనా నివాసం ఉండాలంటే స్థానికులకైతే ఆధార్కార్డు, పని చేసేందుకు వచ్చేవారికైతే గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. కానీ కరోనా ఆంక్షలు తొలగించడంతో.. భక్తులను టీటీడీ అనుమతిస్తుండటంతో పనిచేసేందుకు వస్తున్న వారు కొందరు గుర్తింపు కార్డులు లేకుండా తిరుమల వస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి, హత్యకు పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేటు హోటల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/murder-at-tiutmala-25-140304.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.