Publish Date:Jul 22, 2022
తిరుమల తిరుపతి అనగానే భక్తి పారవశ్యంలో మునుగుతారు జనం. ప్రతీ ఏడూ వెంకన్నను దర్శనా నికి వెళ్లకుంటే తోచని జనాలున్నారు. అక్కడంతా భక్తి, సామరస్య భావన తప్ప మరోటి ఎన్నడూలేదు. తిరు మల అంటేనే సామాజిక సామరస్యానికి, ప్రశాంతతకి ప్రతీక. ఎంతో కట్టుదిట్టమైన రక్షణవ్యవస్థనే గమని స్తుంటాం. పిల్లలు తప్పిపోయినా తమవద్దకు చేర్చగల పోలీసు వ్యవస్థ ఉంది. అలాంటి వెంకన్న సన్నిధిలో ఏకంగా హత్య జరగడం యావత్ తెలుగు లోకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తిరుమ కొండపై హత్య జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలం రేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం దగ్గర వ్యక్తి మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు.
తిరుమలలో హత్య తో ఒక్కసారిగా కలకలంరేగింది. ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా బండ రాయితో మోది హత్య చేశారు. అయితే ఈ దారుణానికి చిన్నపాటి గొడవ కారణమని తిరుమల వన్ టౌన్ పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఆరణి జిల్లాకు చెందిన కె.శరవణన్, వేలూరుకు చెందిన భాస్కర్ ఇద్దరూ తిరుమలలో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. అయితే రాత్రిళ్లు అక్కడే పడుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్థానిక మ్యూజియానికి ఎదురుగా వయోవృద్ధుల టిక్కెట్ల పంపిణీ కేంద్రం దగ్గర భాస్కర్ వచ్చి పడుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత శరవణన్ అక్కడికి వచ్చి తన చోటులో ఎందుకు పడుకున్నావంటూ గొడవపడ్డాడు. బలవంతంగా భాస్కర్ను అక్కడి నుంచి పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న భాస్కర్ శరవణన్పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సిమెంట్ రాయిని తీసుకొచ్చి నిద్రపోతున్న శరవణన్ తలపై మోదాడు. తీవ్ర గాయాలైన అతడు చనిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది.. తర్వాత హత్య ఉదంతం బయటపడింది.. మృతదేహం కనిపించింది. అనంతరం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అర్థ రాత్రి ఘటన జరిగినట్లు గుర్తించారు.
పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భాస్కర్ను అరెస్ట్ చేశారు. అయితే తిరుమలలో హత్య జరగడం హాట్ టాపిక్ అయ్యింది. తిరుమలలో ఎవరైనా నివాసం ఉండాలంటే స్థానికులకైతే ఆధార్కార్డు, పని చేసేందుకు వచ్చేవారికైతే గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. కానీ కరోనా ఆంక్షలు తొలగించడంతో.. భక్తులను టీటీడీ అనుమతిస్తుండటంతో పనిచేసేందుకు వస్తున్న వారు కొందరు గుర్తింపు కార్డులు లేకుండా తిరుమల వస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి, హత్యకు పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేటు హోటల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/murder-at-tiutmala-25-140304.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.