మునుగోడులో బీజేపీ బిల్డప్ అంతా డొల్లేనా? టీఆర్ఎస్ దే పై చేయి అంటున్న సర్వే

Publish Date:Aug 12, 2022

Advertisement

మునుగోడులో బీజేపీకి అంత సీన్ లేదా? కోమటి  రెడ్డి రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిన బీజేపీకి మునుగోడులో భంగపాటు తప్పదా? అంటే తాజా సర్వే ఫలితం ఔననే అంటోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కలిసి వచ్చినట్లు మునుగోడులో బీజేపీకి ఎంత మాత్రం కలిసి వచ్చే అవకాశాలు లేవని, ఇప్పటి దాకా రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన బిల్డప్ అంతా డొల్లేనని మునుగోడు ఫలితం తేల్చేస్తుందనీ ఆ సర్వే బల్ల గుద్ది మరీ చేబుతోంది. మునుగోడులో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యేనని బీజేపీ మూడో స్థానానికి పరిమితమౌతుందని పేర్కొంది. సాస్ గ్రూప్  ఆత్మసాక్షి సర్వే గ్రూప్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్(ఐపిఎస్ఎస్) టీమ్ఈ సర్వేను చేయించింది.

 మండలాల వారీగా, కులాల వారీగా, లబ్ధి దారుల వారీగా ఈ సర్వే చేసినట్లు పేర్కొంది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో రెండు విధానాలలో సర్వే చేసినట్లు ‘ఓటా’ పేర్కొంది. ఒకటి రాండమ్ సర్వే కాగా మరొకటి సెలెక్టివ్ సర్వేగా వివరించింది. ఇలా జరిపిన సర్వేలో మునుగోడులో బీజేపీ పుట్టిమునగడం ఖాయమని తేలిందని పేర్కొంది. బీజేపీ మునుగోడు ఉప ఎన్నికలో మూడో స్థానానికే పరిమితమౌతుందని స్పష్టమైందని సర్వే పేర్కొంది.

ఈ నెల 8-11 తేదీల మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగితే  బీజేపీది బలం కాదు వాపు మాత్రమేనని తేలిపోవడం ఖాయమని సర్వే వెల్లడించింది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలోనూ ర్యాండమ్ పద్దతిలో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. నాంపల్లి మండలంలో 790  , మర్రిగూడ మండలంలో 390, చందూరు మండలంలో 850, మునుగోడు మండలంలో 589,చౌటుప్పల్ మండలంలో 1020, గట్టుప్పల్ మండలంలో 200, నారాయణ పూర్ మండలంలో 520 శాంపిల్స్ చొప్పున సర్వే చేసినట్లు వివరించింది.

నియోజకవర్గం మొత్తంలో 4350 మందిని ర్యాండమ్ గా ప్రశ్నించి వారి అభిప్రాయం తెలుసుకున్నట్లు వివరించింది.  దాదాపు అన్ని మండలాలలోనూ టీఆర్ఎస్ కే మొగ్గు కనిపించిందని సర్వే ఫలితం తేల్చింది. సగటు ఓటు షేరు తీసుకుంటే  టీఆర్ఎస్ కు 40శాతం, కాంగ్రెస్ కు 34.75 శాతం, బీజేపీకి 18 శాతంగా తేలిందని పేర్కొంది.  ఇతరులు 3.25 శాతంగా ఉండగా ఎటూ మొగ్గు చూపని వారు అంటే సైలెంట్ వోట్ ఫ్యాక్టర్ 4 శాతంగా సర్వే పేర్కొంది. దీనిని బట్టి రాష్ట్రంలో బీజేపీది వాపే కాదు బలమేనని సర్వే ఫలితం తేల్చేసింది.

మునుగోడులో ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్యేనని, నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రాజగోపాల రెడ్డి రాజీనామాకు రేవంత్ పై వ్యతిరేకత, కాంట్రాక్టులే కానీ నియోజకవర్గ అభివృద్ధి కాదని భావిస్తున్నారని పేర్కొంది.  మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ సర్కార్ చేనేత బీమా ప్రకటించిందనీ, దీర్ఘ కాలంగా ఇక్కడి ప్ర.జలు డిమాండ్ చేస్తున్నగట్టుప్పల్ మండలాన్ని ప్రకటించడంతో జనం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా సర్వే పేర్కొంది.  

By
en-us Political News

  
ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు.
పోలింగ్ ముగిశాక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వైసీపీ వర్గాలు మాత్రం నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి కనిపిస్తున్నారు.
నగరి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం వదలబోతోంది. ఆ నియోజకవర్గ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా ఓడిపోబోతోంది.
నాలుగో విడత పోలింగ్ సమాప్తం
పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీ అన్ని విలువలకూ వలువలు విప్పేసి యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసింది.
పోలింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నాయకత్వంలో  బీభత్సం సృష్టించారు
5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్
 ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అయితే ఎవరు ఎంత చెప్పినా.. కొందరు మాత్రం అస్సలు మారరు. గడప దాటరు. ఓటు వేయరు. ఏం జరిగినా మనకెందుకులే అని కూర్చొంటారు. అలాంటి వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.
కుప్పం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిని బద్దలు కొడతామంటూ ఇంత కాలం వైసీపీ ప్రగల్భాలు పలికింది.
పుణ్యక్షేత్ర సమీపంలో కూడా వైసీపీ నేతలు పాపపు పనులు మానుకోవడం లేదు. తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ నాయకులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు.
జిల్లాల వారీగా ఏపీ పోలింగ్ శాతం 3 గంటలకు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.