మునుగోడులో బీజేపీ బిల్డప్ అంతా డొల్లేనా? టీఆర్ఎస్ దే పై చేయి అంటున్న సర్వే

Publish Date:Aug 12, 2022

Advertisement

మునుగోడులో బీజేపీకి అంత సీన్ లేదా? కోమటి  రెడ్డి రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిన బీజేపీకి మునుగోడులో భంగపాటు తప్పదా? అంటే తాజా సర్వే ఫలితం ఔననే అంటోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కలిసి వచ్చినట్లు మునుగోడులో బీజేపీకి ఎంత మాత్రం కలిసి వచ్చే అవకాశాలు లేవని, ఇప్పటి దాకా రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన బిల్డప్ అంతా డొల్లేనని మునుగోడు ఫలితం తేల్చేస్తుందనీ ఆ సర్వే బల్ల గుద్ది మరీ చేబుతోంది. మునుగోడులో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యేనని బీజేపీ మూడో స్థానానికి పరిమితమౌతుందని పేర్కొంది. సాస్ గ్రూప్  ఆత్మసాక్షి సర్వే గ్రూప్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్(ఐపిఎస్ఎస్) టీమ్ఈ సర్వేను చేయించింది.

 మండలాల వారీగా, కులాల వారీగా, లబ్ధి దారుల వారీగా ఈ సర్వే చేసినట్లు పేర్కొంది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో రెండు విధానాలలో సర్వే చేసినట్లు ‘ఓటా’ పేర్కొంది. ఒకటి రాండమ్ సర్వే కాగా మరొకటి సెలెక్టివ్ సర్వేగా వివరించింది. ఇలా జరిపిన సర్వేలో మునుగోడులో బీజేపీ పుట్టిమునగడం ఖాయమని తేలిందని పేర్కొంది. బీజేపీ మునుగోడు ఉప ఎన్నికలో మూడో స్థానానికే పరిమితమౌతుందని స్పష్టమైందని సర్వే పేర్కొంది.

ఈ నెల 8-11 తేదీల మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగితే  బీజేపీది బలం కాదు వాపు మాత్రమేనని తేలిపోవడం ఖాయమని సర్వే వెల్లడించింది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలోనూ ర్యాండమ్ పద్దతిలో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. నాంపల్లి మండలంలో 790  , మర్రిగూడ మండలంలో 390, చందూరు మండలంలో 850, మునుగోడు మండలంలో 589,చౌటుప్పల్ మండలంలో 1020, గట్టుప్పల్ మండలంలో 200, నారాయణ పూర్ మండలంలో 520 శాంపిల్స్ చొప్పున సర్వే చేసినట్లు వివరించింది.

నియోజకవర్గం మొత్తంలో 4350 మందిని ర్యాండమ్ గా ప్రశ్నించి వారి అభిప్రాయం తెలుసుకున్నట్లు వివరించింది.  దాదాపు అన్ని మండలాలలోనూ టీఆర్ఎస్ కే మొగ్గు కనిపించిందని సర్వే ఫలితం తేల్చింది. సగటు ఓటు షేరు తీసుకుంటే  టీఆర్ఎస్ కు 40శాతం, కాంగ్రెస్ కు 34.75 శాతం, బీజేపీకి 18 శాతంగా తేలిందని పేర్కొంది.  ఇతరులు 3.25 శాతంగా ఉండగా ఎటూ మొగ్గు చూపని వారు అంటే సైలెంట్ వోట్ ఫ్యాక్టర్ 4 శాతంగా సర్వే పేర్కొంది. దీనిని బట్టి రాష్ట్రంలో బీజేపీది వాపే కాదు బలమేనని సర్వే ఫలితం తేల్చేసింది.

మునుగోడులో ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్యేనని, నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రాజగోపాల రెడ్డి రాజీనామాకు రేవంత్ పై వ్యతిరేకత, కాంట్రాక్టులే కానీ నియోజకవర్గ అభివృద్ధి కాదని భావిస్తున్నారని పేర్కొంది.  మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ సర్కార్ చేనేత బీమా ప్రకటించిందనీ, దీర్ఘ కాలంగా ఇక్కడి ప్ర.జలు డిమాండ్ చేస్తున్నగట్టుప్పల్ మండలాన్ని ప్రకటించడంతో జనం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా సర్వే పేర్కొంది.  

By
en-us Political News

  
ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే...
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది. కొత్త ఓటర్లు, యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు.
అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు.
కిందపడ్డా నాదే పైచేయి అంటారు చూశారా.. అలా వుంది నగరిలో మటాష్ అవబోతున్న రోజా వ్యవహారం. మొదటగా నగరి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పదేళ్ళుగా మీ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రోజాని మీ ఓటు ద్వారా సాగనంపారు.
ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించడం రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడు అని చెబుతున్నప్పుడు కేసీఆర్ ముఖంలోగానీ, కేటీఆర్ ముఖంలోగానీ కనిపించే పైశాచిక ఆనందాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు.
పోలింగ్ శాతం పెర‌గ‌డంతో వైసీపీ మ‌రింత డీలా ప‌డింది. ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంది. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ సారి ఓటేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది.
వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయా.. ఆ పార్టీ నమ్ముకున్న గూండాయిజం వైసీపీకి గులుపు ఉన్న స్థానాలలో కూడా ఓటమిని శాశించిందా? అంటే జనం ఔననే అంటున్నారు. పరిశీలకులు కంసుడి పతనానికి ముందు కనిపించిన శకునాలను నిన్నటి పోలింగ్ లో జరిగిన సంఘటనలతో పోలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులూ ఆ పార్టీకీ ఛీ కొట్టేశారు. సంక్షేమం అంటూ తమ ఇంత కాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధాదారులు కదా, మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటు వైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్ లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు.
వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోవ‌టం ఖాయ‌మైంది. ఐదేళ్ల‌ పాటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌, అరాచ‌క పాల‌న‌కు విసిగిపోయిన ఏపీ ప్ర‌జలు ఓటు ద్వారా వీడ్కోలు ప‌లికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భ‌యాందోళ‌న‌కు గురిచేసినా, ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెద‌రకుండా, అద‌ర‌కుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు ఓట‌ర్లు పోటెత్తారు.
ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.