Publish Date:Oct 18, 2022
మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకే ఏదోవిధంగా ఈ ఉప ఎన్నికను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఎనిమిది గుర్తులను రద్దు చేయాలని టీఆర్ఎస్ వేసిన పిటిషన్ను రాష్ట్ర హై కోర్టు కొట్టేయడంపై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్ న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యారగండ్ల పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో కేసీఆర్ ఎన్నికలను ఆపాలని కుట్ర చేస్తున్నారనీ, అందులో భాగమే ఎన్నికల గుర్తులను రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ కోర్టుకు వెళ్లిందన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు విజయం న్యాయానిదేననీ, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం తథ్యమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ రద్దు చేయమని అడుగుతున్న గుర్తులు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉన్నాయనీ, మరి ఇన్నాళ్లూ లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/munugodu-defeat-fear-in-kcr-trying-to-stop-election-25-145647.html
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు
జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు.
రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు.
ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్కుమార్ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్కు ఆయన వివరించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
వరుస దెబ్బలు తగులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వచ్చినట్టు కనిపించడం లేదా? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల పట్ల ఉండాల్సిన నిబద్ధత మరచి మరీ జగన్ అనుంగు మీడియా వ్యవహరించడం చేటు తెస్తుందా? అంటే అదే నిజమని తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో స్పందించారు.
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.