Publish Date:Dec 31, 2019
కమలం జోరు, కాంగ్రెస్ ఫైట్ నిజమాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల చిత్రమిది. బల్దియా ఎన్నికల కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గత మున్సిపల్ ఎన్నికల తరవాత ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఇప్పుడు నిజామాబాద్ కారు ఓవర్ లోడ్ తో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ లో 10 డివిజన్లను టిఆర్ఎస్, 16 డివిజన్లను కాంగ్రెస్, 16 డివిజన్లలో ఎంఐఎం, బీజేపీ 7 డివిజన్లు, ఇండిపెండెంట్లు 1 డివిజన్ లో గెలుపొందారు. అప్పటి రాజకీయ సమీకరణాల్ని బట్టి ఎంఐఎం, టిఆర్ఎస్ స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అయితే ఆ తరువాత కాంగ్రెస్ తరపున గెలిచిన 14 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరారు. బిజెపి నుంచి ఆరుగురు కారు లోకి జంప్ అయ్యారు. దీంతో 30 మంది కార్పొరేటర్ల బలం టిఆర్ఎస్ కు చేకూరింది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ లో రాజకీయ పరిస్థితులు మారాయి. శివారు గ్రామాలు కార్పొరేషన్ లో చేరాయి. దీంతో డివిజన్ల సంఖ్య 60 కి చేరింది. గ్రామీణ ప్రాంతాలు విలీనం కావడం తమకు కలిసొస్తుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
టీఆర్ఎస్ గతంలో లాగానే ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే అవకాశముంది. మిగిలిన ప్రతి పక్ష పార్టీలో ఒంటరి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ రాజకీయ ముఖచిత్రం మారింది. సీట్ల సంఖ్య 36 కు పెరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు చాలామంది అధికార పార్టీ లోకి వలస వచ్చారు. కాంగ్రెస్ గతంలో బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. బీజేపీ ఈ సారి ఇక్కడ పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 146 వార్డులు ఉన్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్ వల్ల సగం సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి. దీంతో ఈ మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు నడిచే అవకాశముంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/municipal-polls-in-nizamabad-25-92750.html
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.