ఆటూ ఇటూ కాకుండా పోయిన కాపు ఉద్యమ నేత ‘ముద్ర’గడ!

Publish Date:May 4, 2024

Advertisement

కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆయన  ‘ముద్ర’ను సొంత కుటుంబమే చెరిపేసింది.  ఆయన వైసీపీ గూటికి చేరి.. ఫ్యాన్ గాలితో  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తానన్నారు.

 అయితే సొంత ఇంటిలోనే ఫ్యాన్ రెక్కలు తిరగడం మానేశాయి. స్వయంగా ఆయన కుమార్తె  తండ్రిని నమ్మవద్దని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తానికీ పిలుపు నిచ్చింది. తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం కోసం పని చేస్తానని ప్రకటించి.. తన తండ్రి ముద్రను కాపు సామాజికవర్గంలో చెరిపేసింది.   దీంతో స్వయంప్రకటిత కాపు ఉద్యమ నేత ‘ముద్ర’ పద్మనాభానికి ఇక లేకుండా పోయింది. 

పిఠాపురంలో పవన్ కల్యాణ్ జోరును అడ్డు కోవాలంటే కాపు సాజాజిక వర్గంలో తనదైన ‘ముద్ర’ ఉన్న పద్మనాభం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఒక్కటే మార్గమని భావించిన వైసీపీ అధినేత సీఎం జగన్  బోల్తాపడ్డారు. నాయకుడుగా ముద్రగడ వైఫల్యాలు తుని ఘటనతోనే బహిర్గతమయ్యాయి. ఆ తరువాత ఉప్మా ఖర్చులు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పేరు ఎత్తిన రోజునే  కాపు యువతలో ఆయన ‘ముద్ర’ చెరిగిపోయింది. ఇప్పుడు.. ఇక పిఠాపురంలో జనసేన కోసం ఆయన ప్రచారంలో చెస్తున్న వ్యాఖ్యలు సొంత కుమార్తెకే వెగటు కలిగిస్తున్నాయంటే.. ఆయన పరువు ఏ గంగలో కలిసిందో ఆయనే చెప్పుకోవాలి.  ఇక సొంత కుమార్తె వద్దే చెల్లని ముద్ర  ఇక బయట కాపు సామాజిక వర్గంలో ఏం చెల్లుతుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  తండ్రిపై కూతురు ఎగురవేసిన తిరుగుబావుటా.. కాపు సామాజికవర్గంలో తనకు ఉందని ఆయన స్వయంగా చెప్పకుంటున్న ఇమేజిని డ్యామేజీ చేసి గ్యారేజీకి పంపేసింది.  

అన్నిటికీ మించి ముద్రగడ బానిసలా మారిపోయారనీ, జగన్ ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతూ, జగన్ పవన్ ను ఏం తిట్టమంటే అది తిడుతున్నారనీ సొంత కుమార్తె ఇచ్చిన వీడియో సందేశం ఏపీ రాజకీయాలలో ఒఖ సంచలనంగా మారింది. ఇప్పుడిక వైసీపీ కూడా ముద్రగడ విషయంలో పునరాలోచనలో పడినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ముద్రగడను ముందుపెట్టి.. కాపు సామాజికవర్గ ఓట్లను దండుకునే అవకాశం అటుంచి,  అసలు ఆయన తమ పక్కన ఉండటమే మైనస్ గా మారిందన్న భావన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. దీంతో ఆయనను పక్కన పెట్టేయడమే బెటర్ అని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
కబ్జాలకే ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్నే ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతల్లోకెల్లా వింత.. సరికొత్త ప్రపంచ వింత. 
Publish Date:May 18, 2024
మహాభారతంలో శకుని పాత్ర చాలా కీలకమైనది. తన దుష్టపన్నాగాలతో పాండవులను అంతమొందించాలని ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నంలో కౌరవ నాశనానికి కారకుడైనాడు. సరిగ్గా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిచాణా ఎత్తేసే సూచనలు కనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు.  దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ‘పల్నాటి పిల్లి’ అనే బిరుదును, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ‘పల్నాటి పిల్ల పిల్లి’ అనే బిరుదులు ప్రదానం చేయడమైనది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పల్నాడులో ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు హింసాకాండపై చాలా సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వివరణ కోరింది.
యూకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు పోటీ చేయబోతున్నారు. లేబర్ పార్టీ తరపున ఆయన బరిలో నిలవనున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ ఎంపీ అభ్యర్థిగా నాగరాజును లేబర్ పార్టీ ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడి ముగిసీముగియగానే పాలనపై దృష్టి పెట్టారు. శనివారం ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా రుణమాఫీకి నిధుల సమీకరణ విషయంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
ఓటుకు ఐదు వందలు పంచిన నేరం మీద ఎన్నికల కమిషన్ ఆయన్ని వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మే 18( శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు.
విషయాన్ని డైవర్ట్ చేసి తాము అనుకున్నది సైలెంట్ గా చేసుకుని పబ్బం గడిపేయడంలో వైసీపీ నేతలు డాక్టరేట్ సాధించారని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ వారు ఒకటి చేయాలనుకుంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. అదే సమయంలో తాము చక్కబెట్టదలచుకున్న కార్యాన్ని సెలెంట్ గా చక్కబెట్టేస్తారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-18
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.