Publish Date:Jan 18, 2025
ముడాస్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కుంభకోణం మూలాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ముడా కుంభకోణానికి అసలు సూత్రధారి సిద్దరామయ్య పుత్రరత్నం, ఎమ్మెల్యే అయిన యతీంద్రేనని ఈడీ అనుమానిస్తోంది.
తాజాగా ఆ కుంభకోణంలో అక్రమంగా ఫ్లాట్ లు పొందిన 142 సైట్లను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపుగా రూ. 300 కోట్లు ఉంటుంది.
మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ భూ కేటాయింపులో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. కేటాయించిన 1059 ప్లాట్లు అన్ని 50:50 నిష్పత్తిలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చేశారని వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 700 కోట్ల ఉందని పేర్కొంది.
ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిని పొంది తరువాత భారీ లాభాలతో అమ్మి సొమ్ము చేసుకున్నారని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి పేరు మీద 14 ఇళ్ల స్థలాలు ఉన్నాయని ఇవన్నీ అక్రమంగా కేటాయించుకున్నవే అని విచారణ లో తేలింది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, రికార్డులు మార్చివేసి మరీ కేటాయించినట్లు ఈడీ దర్యాప్తు తేల్చిందని చెబుతున్నారు. ఈడీ వాటినీ సీజ్ చేసింది.
మైసూర్ లో కేటాయించిన భూమిలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపణలు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు లోకాయుక్తను ఆశ్రయించారు. దానితో సిద్దరామయ్య, ఆయన భార్య ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ కేసులో మనీలాండరింగ్ ఉండటంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది.
ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది సీఎం కుమారుడు ఎంఎల్ఏ యతీంద్ర అని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అమ్మ అయిన పార్వతి పేరు మీద అక్రమంగా ఫ్లాట్ల కేటాయింపులు జరపడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చారని తెలుస్తోంది. అలాగే మరో 252 సైట్లు కూడా ఎలాంటి పత్రాలు, అనుమతి లేకుండా ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించడంలో చక్రం తిప్పారని ముడా అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందది. తరువాత వీటిని భారీ లాభాలకు అమ్మి వాటిని వివిధ మార్గాల్లో సొంత ఆస్థిగా మలుచుకున్నారని ఈడీ భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/muda-scam-karnataka-cm-son-mastermind-39-191476.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.