Publish Date:Jan 18, 2025
ముడాస్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కుంభకోణం మూలాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ముడా కుంభకోణానికి అసలు సూత్రధారి సిద్దరామయ్య పుత్రరత్నం, ఎమ్మెల్యే అయిన యతీంద్రేనని ఈడీ అనుమానిస్తోంది.
తాజాగా ఆ కుంభకోణంలో అక్రమంగా ఫ్లాట్ లు పొందిన 142 సైట్లను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపుగా రూ. 300 కోట్లు ఉంటుంది.
మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ భూ కేటాయింపులో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. కేటాయించిన 1059 ప్లాట్లు అన్ని 50:50 నిష్పత్తిలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చేశారని వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 700 కోట్ల ఉందని పేర్కొంది.
ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిని పొంది తరువాత భారీ లాభాలతో అమ్మి సొమ్ము చేసుకున్నారని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి పేరు మీద 14 ఇళ్ల స్థలాలు ఉన్నాయని ఇవన్నీ అక్రమంగా కేటాయించుకున్నవే అని విచారణ లో తేలింది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, రికార్డులు మార్చివేసి మరీ కేటాయించినట్లు ఈడీ దర్యాప్తు తేల్చిందని చెబుతున్నారు. ఈడీ వాటినీ సీజ్ చేసింది.
మైసూర్ లో కేటాయించిన భూమిలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపణలు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు లోకాయుక్తను ఆశ్రయించారు. దానితో సిద్దరామయ్య, ఆయన భార్య ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ కేసులో మనీలాండరింగ్ ఉండటంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది.
ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది సీఎం కుమారుడు ఎంఎల్ఏ యతీంద్ర అని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అమ్మ అయిన పార్వతి పేరు మీద అక్రమంగా ఫ్లాట్ల కేటాయింపులు జరపడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చారని తెలుస్తోంది. అలాగే మరో 252 సైట్లు కూడా ఎలాంటి పత్రాలు, అనుమతి లేకుండా ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించడంలో చక్రం తిప్పారని ముడా అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందది. తరువాత వీటిని భారీ లాభాలకు అమ్మి వాటిని వివిధ మార్గాల్లో సొంత ఆస్థిగా మలుచుకున్నారని ఈడీ భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/muda-scam-karnataka-cm-son-mastermind-39-191476.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.