Publish Date:Jun 20, 2022
ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు చదువుకోవడానికి వీలుగా, కాలేజీలకు దగ్గరి ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో వుండడం పరిపాటి. కుంటుంబాలు కూడా తమ పిల్లలకు రవాణా ఇబ్బందులు లేకుండా వుండేం దుకు సాధ్యమయినంతవరకూ కాలేజీలకు, స్కూళ్లకు దగ్గరి ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లలో వుంటున్నారు. ఇది ప్రతీ పట్టణంలోనూ సాధారణంగా కనిపించే సీన్. చదువు అయి వెళ్లేటపుడో, పోనీ వేరే ప్రాంతానికి వెళ్లవలసినపుడో ఆ ఇంటి యజమానికి చెల్లించవలసిన అద్దె, కరెంటు బిల్లు ఏమన్నా వుంటే పూర్తిగా చెల్లించి మరీ వెళతారు. ఆంధ్రా తెలంగాణా విడిపోయిన తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె ఇళ్లలో వున్నాయి. స్వంత భవనాలు ఇంకా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఇంకా కొన సాగుతోంది.
అలా వున్నదే నంద్యాల జిల్లా పాములపాడులోని ఎమ్మార్వో కార్యాలయం. దీన్ని గురించి ప్రత్యేక ప్రస్థా వన దేనికంటే .. ఈ కార్యాలయానికి కొత్త భవనం ఏర్పాటయింది. కానీ కార్యాలయం వస్తువులు, ఫైళ్లు ఫర్నీచర్ మాత్రం అక్కడికి మార్చే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఇప్పటి వరకూ అద్దెకున్న భవ నానికి ప్రభుత్వం అద్దె కట్టలేదట! మరి అద్దె కట్టకుంటే యజమాని కాగితం కదలనిస్తాడా? మరి ప్రభు త్వం ఈ సాధారణ నియమాన్ని నిర్లక్ష్యం చేయడమేమిటి?
పాములపాడులో ఎమ్మార్వో కార్యాలయం వున్న భవనానికి ఇంతవరకూ అద్దే చెల్లించలేదట. ప్రభుత్వం ఏర్పాటయిన సుమారు నాలుగేళ్ల నుంచి ఆ భవనానికి అద్దెగా ఒక్క పైసా ఇవ్వలేదని భవనం యజమాని ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఆయనకు రూ.3,65,868 రూపాయలు చెల్లించాలి. ఆ మొత్తం చెల్లిస్తేనే ఇక్కడ నుంచి వస్తువులు బయటికి వెళతాయని తెగేసి చెప్పేడు. అంతేకాదు భవనానికి ఏకంగా తాళం వేసేసేడు. ఈ రహస్యమేమీ తెలియని ప్రజలు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అక్కడ తాళం వేసి వుండడం చూసి ఖంగారు పడ్డారు. జగన్ పాలనలో ఇలాంటి కామెడీలు కూడా జరుగుతున్నాయన్నది వారికి తెలియడానికి చాలా సమయమే పట్టింది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mro-office-locked-for-not-paying-rent-39-138030.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.