ఎంపీల వేతనాలు సరే.. రైతుల మాటేమిటి?

Publish Date:Mar 25, 2025

Advertisement

లోకసభ, రాజ్యసభ సభ్యుల జీతాల భృత్యాలు పెరిగాయి.  వాస్తవానికి వీరి జీతాలు రెండేళ్ల కిందటే పెరగాల్సి ఉంది.  అయితే జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పెంరిగింది. పెరగడమే కాదు.. ఈ పెంపు  2023 నుంచి అమలులోకి వస్తుంది.  రెండేళ్ల  అరియర్స్ కూడా ఎంపీలు అందుకుంటారు. గతంలో  ఎంపీలకు లక్ష రూపాయల వేతనం అందుకునే వారు. ఇప్పుడు అదనంగా 24 వేల రూపాయలు అందుతుంది. అంతే కాకుండా వారికి డిఏ కూడా 500 రూపాయలు పెరిగాయి. ఆఫీసు నిర్వహణకు,ఇంటి అద్దెకు నెలకు గరిష్టంగా రెండు లక్షల60 వేలు వస్తుంది. విమాన ప్రయాణాలు అయితే  ఏడాదికి 34 సార్లు ఉచిత ప్రయాణం. ఉచిత విద్యుత్, నీరు తదితర అలవెన్సులు ఇస్తారు. ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచడంలో తప్పులేదు. గతంలో అన్నీ త్యాగం చేసి ఎంపీలుగా పనిచేసిన వారు పదవి పూర్తయిన తరువాత  బతకడం కష్టంగా ఉండేది. 
ప్రజా ప్రతినిధులకు  జీతాల పెంపు పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వారి పింఛన్ల విషయాన్ని కూడా కేంద్రం పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సామాజిక  పింఛన్లే  4000 రూపాయలు ఉన్నాయి. కానీ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి వచ్చే పెన్షన్ వేయి రూపాయలు మాత్రమే కావడంతో , ఇటువంటి వారి పెన్షన్ ను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.  
అదే విధంగా రైతుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది.  సరైన మద్దతు ధర లభించడంలేదు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే ధరకు, అది వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో ఉన్న ధరకూ వ్యత్యాసం భారీగా ఉంటోంది. అంటే రైతు కష్టం దళారుల పాలౌతోంది. ఈ దళారి వ్యవస్థను తొలగించి రైతుకే నేరుగా లాభసాటిగా ఉండేలా ధ్యాన్యం విక్రయాలు నెరపుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.   దేశంలోని అన్ని వర్గాలకు కనీస అవసరాలకు సరిపడా  వేతనం లేదా పింఛన్లు వచ్చేలా  చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వృద్ధులకు 70 ఏళ్ల తరువాత ఉచిత ఆరోగ్యం కల్పిస్తామని ప్రధాని పేరుమీద పథకం ప్రకటించారు. కాని దాన్ని 60 ఏళ్ల నుంచి అమలు చేయాల్సిఉంది. దేశాన్ని ఇన్ని  సమస్యలు  పట్టి పీడిస్తుండగా అత్యంత జరూరుపనిలోలాగా ఎంపీల జీతాల పెంపు కార్యక్రమం చేపట్టడం పట్ల ఒకింత అసంతృప్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంపీల జీతాల పెంపుతో6పాటే.. రైతులజీవితాలు,వృద్ధుల జీవితాలు బాగుపడే నిర్ణయం కూడా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. తాజాగా మరో మారు రేవంత్ కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చినట్లే వచ్చి మళ్లీ తెర వెనక్కు వెళ్లింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూంచ్ జిల్లాను సందర్శించి పాకిస్తాన్ దాడుల బారినపడిన బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
రుమల తిరుపతి భద్రతకు ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న హరీష్ కుమార్ గుప్తా.. దర్శనానంతరం తిరమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
రాజకీయ, సినిమా రంగాల సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ, సినిమా రంగాలు పాలు నీళ్ళలా కలిసి పోయాయి.
అది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్. అక్క‌డ పీఎంఎంఎల్ అంటే పాకిస్తాన్ మ‌ర్క‌జీ ముస్లిం లీగ్ అనే ఒక రాజ‌కీయ పార్టీ ర్యాలీ నిర్వ‌హిస్తే అందులో ఒక‌డు క‌నిపించాడు. ఈ మ‌ధ్య అంటే, మే 28న అత‌డిని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్ర వేసింది ఐక్య రాజ్య‌స‌మితి. అందుకు అత‌డ‌న్న మాట నేనిపుడు వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. ఇంత‌కీ అత‌డు చేసిన ఘ‌న‌కార్యం ఏంట‌ని చూస్తే ప‌హెల్గాం దాడి ద్వారా 26 మంది భార‌తీయుల‌ ప్రాణాలు పోయేలా చేయ‌డం. అతడి పేరు సైఫుల్లా కసూరి.
పెద్దపల్లి జిల్లా మంచిర్యాల పర్యటనలో మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు సొంత అజెండా ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన అని ఆమె అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగున్నాయని మీడియా చిట్ చాట్ లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ అంటూ కేసేఅర్ కు రాసిన, లేఖలోనూ కవిత, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మధురిల వ్యవహారం ఎంత అలజడి రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హై ఎనర్జిటిక్ ఫ్యామిలి డ్రామా అప్డేట్స్ అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో సైతం సేన్షేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ టోటల్ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీను ఇంటికి దివ్వెల మాధురి ప్రవేశించడం.. అక్కడితో దువ్వాడ వాణి అకస్మాత్తుగా తన నిరసనకు మంగళం పాడి మాయం అవ్వడం.. క్లైమాక్స్ లేని కధగా మారింది.
కడప వైఎస్ జగన్ అడ్డా అన్న అపోహ ఈ మహానాడుతో తొలగిపోయిందనని వారు అన్నారు. కడపలో తెలుగుదేశం మహానాడు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం వైఎస్ కుటుంబానికి చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమం వినూత్నంగా నిలిచింది. పర్యాటక ప్రదేశం అయిన రామనారాయణం లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో రామధనస్సు ఆకృతిలో పదిహేను వందలమంది యోగాసనాలు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
బనకచర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.