వివేకానందరెడ్డి హత్య కేసు.. సీబీఐ అఫిడవిట్ లో ఆ ఎంపీ పాత్ర?

Publish Date:Oct 20, 2022

Advertisement

మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తున్న సీబీఐ అధికారులను నిందితులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని సీబీఐ స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు డీ. శివశంకర్ రెడ్డిని 2021 నవంబర్ 18న పులివెందులలోని కోర్టులో హాజరుపరిచినప్పుడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తన అనుచరులతో పాటు కోర్టు గదిలోకి ప్రవేశించి, రిమాండ్ లాంఛనాలు పూర్తిచేస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నార’ని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలపడంతో  వివేకా కేసులో మరో సంచలన విషయం బయటపడినట్లైంది.

ఈ హత్య కేసులోని నిందితులు శక్తిమంతులని, సాక్షులను బెదిరిస్తూ విచారణను జాప్యం చేసేందుకు యత్నిస్తున్నారని, అందువల్ల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి,  భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్ కు స్పందనగా సీబీఐ వేసిన అఫిడవిట్ లో ఈ విషయం స్పష్టం చేసింది. సీబీఐ విచారణ అధికారులను ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డుకున్న వైనాన్ని పూసగుచ్చినట్లుఆ అఫిడవిట్ లో వెల్లడించింది. వివేకా హత్య కేసులోని సాక్షులు, సీబీఐ అధికారులకు ఏపీలో ఎదురవుతున్న బెదిరింపుల దృష్ట్యా అక్కడ విచారణ, దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందనిపించడంలేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.  అందుకే వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలే చేసేందుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎం ఎం సుందరేశ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘ఆ రోజున అవినాశ్ రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులను వెంటేసుకుని కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. వివేకా హత్య కేసులో ఏ5 శివశంకర్ రెడ్డికి మద్దతు పలికారు. శివశంకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశావంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించారు. అక్కడే శివశంకర్ రెడ్డితో కూడా మాట్లాడారు. సీబీఐ బృందం కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో అవినాశ్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో స్పష్టం చేయడం గమనార్హం. ‘శివశంకర్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే అతనిని కడప సెంట్రల్ జైలు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాని గురించి 2021 నవంబర్ 25న పులివెందుల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు.  జైలు అధికారుల తీరును తప్పుపట్టారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో వెల్లడించింది. ‘వివేకా హత్య కేసులో సాక్షి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోగా.. మరో సాక్షి గంగాధరరెడ్డి కూడా చనిపోయాడు. గంగాధరరెడ్డి మరణాన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు’ అని కూడా సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన 278 పేజీల అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం.

సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన అఫిడవిట్ లో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారని స్పష్టంగా పేర్కొనడంతో వివేకా హత్య కేసు వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి మరణం వెనక ఉన్న కీలక సూత్రధారులను బయటపెట్టాలంటూ తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఒక సమాధానం లభించినట్లయిందని అంటున్నారు. తన తండ్రిని దారుణంగా చంపిన, చంపించిన వారిని వదిలిపెట్టేది లేదంటూ సునీతారెడ్డి ఒక విధంగా యుద్ధమే చేస్తున్నారంటున్నారు. మాజీ  సీఎం వైఎస్సార్ కు స్వయంగా తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చడం వెనుక మరిన్ని పెద్ద తలలే ఉన్నాయనే అనుమానాలకు సీబీఐ సుప్రీంలో ఇచ్చిన అఫిడవిట్ మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు.

వివేకా హత్య  వెనుక బలమైన అదృశ్య శక్తులు కీలకంగా ఉన్నందువల్లే సంఘటన జరిగి మూడేళ్లయినా దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటున్నారు. వివేకా హత్య కేసు విచారణ నిష్పాక్షికంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదని.. ధర్మాసనం సభ్యుడు జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించడం కూడా కేసు వెనుక ఎంతటి బలమైన శక్తులు పనిచేస్తున్నాయో అర్థం అవుతోందంటున్నారు. నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ఏపీలో కాకుండా ఢిల్లీ, తెలంగాణలలో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని నిందితుల తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు.

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.