అందని ద్రాక్ష పుల్లనంటున్న రాజయ్య

Publish Date:May 31, 2013

Advertisement

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్, కేశవ్ రావు, వివేక్, మందాలకు సకుటుంబ సపరివారంగా పార్టీలో జేరెందుకు టికెట్స్ పంచిఇచ్చి తనకు మాత్రం హ్యాండివ్వడంతో కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన రాజయ్య ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొట్టుకొంటున్నారు.

 

‘కాంగ్రెస్ పార్టీ లోంచి తెరాసలోకి జంపు చేసేస్తున్నానహో!’ అని చాటింపు కూడా వేసేసుకొని మూట ముల్లె సర్దుకొని రోడ్డు మీదకి వచ్చేసిన తరువాత, కేసీఆర్ తనని మాత్రం వదిలిపెట్టి మిగిలిన ముగ్గురినే తన కారెక్కించుకొని బుర్రు మంటూవెళ్లిపోయి తన పరువు తీసాడని ఆయన ఆవేశంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ తనని మోసం చేసాడని ఆయన ఆక్రోశిస్తున్నారు.

 

అటువంటి వాడిని నమ్మి కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళకపోవడమే మంచిదయిందని తనను తానూ సముదాయించుకొని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే తెలంగాణా కోసం నిరంతర పోరాటం చేస్తానని ప్రకటించేశారు. తెలంగాణా సాదించేవరకు తన పోరాటం ఆగదని పనిలోపనిగా ప్రకటించేశారు.

 

కేవలం తెలంగాణా ఉద్యమంలో పాల్గొనడానికే తెరాసలోకి వెళ్తున్నామని చెప్పుకొంటున్న ఆ ముగ్గురు నేతలు, కాంగ్రెస్ పార్టీలో చిక్కుకుపోయిన రాజయ్య అందరి ఆలోచనలు కూడా తమకీ, తమ సంతానానికి, ఇంకా వీలయితే తమ బందుగణానికి టికెట్స్ సంపాదించుకోవడమేనని ఈ వ్యవహారాలతో స్పష్టం అవుతోంది.

 

టికెట్స్ ఇస్తే ఉద్యమం కోసం పార్టీ మారుతారు. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉద్యమం చేస్తామంటారు. దీనిని బట్టి తెలంగాణా సాదించుకోవడం పట్ల వారికెంత గొప్ప నిబద్దత ఉందో అర్ధం అవుతోంది. వారి ప్రాదాన్యత కేవలం పార్టీ టికెట్స్ కే తప్ప తెలంగాణాకి కాదని మరోమారు నిరూపించారు.

 

ఇక, ఉద్యమం కోసం ఇంతకాలం పోరాడిన వారిని కాదని, టికెట్ ఎరలు వేసి ఇతర పార్టీలలోని ‘సౌండ్ పార్టీలను’ తమ పార్టీలోకి ఆకర్షించాలనుకోవడం కేసీఆర్ నైజం తెలియజేస్తోంది. ఏది ఏమయినప్పటికీ, తెలంగాణా సాధన కంటే రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ సంపాదించుకోవడమే నేడు అందరి ప్రధానధ్యేయంగా మారిందని జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

By
en-us Political News

  
నా తండ్రికి ఉత్తరం రాసిన మాట వాస్తవమే. కానీ అది రెండు వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేకసార్లు చెప్పాని కవిత క్లారిటీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు తమకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు
కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు.
క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం.
తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.