Publish Date:Sep 14, 2020
వైసిపి పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరో సారి అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం జగన్ తన పార్టీ ఎంపీలు అందరికీ ఒక సమావేశం ద్వారా మార్గనిర్దేశం చేశారు. అయితే.. రఘురామ రాజుకి మాత్రం ఈ సమావేశానికి పిలవలేదు. వైసిపి ఎంపీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందని ఉదయం 9 గంటలకు ఏపీ భవన్ నుంచి అందరికి ఆహ్వానం అందింది. అయితే అంతలోనే 11:10 గంటలకు రఘురామరాజుకు ఫోన్ చేసి పార్టీకి మీకు ఎటువంటి సంబంధం లేదు.. మీరు సమావేశానికి రావొద్దని చెప్పారు. తాజాగా దీనిపై రఘురామరాజు స్పందిస్తూ.. "నన్ను వైకాపా నుంచి బహిష్కరించారనే భావిస్తున్నాను. అయితే దీనిపై రాతపూర్వక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. అయితే నన్ను బహిష్కరించినప్పటికీ నేను పార్టీ జారీ చేసే విప్ ను మాత్రం పాటిస్తాను. ప్రస్తుతం నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. మీడియాలో కూడా విద్యావంతులు ఉన్నారు కాబట్టి దీనిపై మీరు ఎలా రాసుకుంటారో రాసుకోండి" అని మీడియాకు తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అయన ‘‘ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానన్నారు. అయితే నా ముఖంతోనే నేను గెలిచాను. నా ముఖం చూసే ప్రజలు బటన్ నొక్కారు. అది అటు ప్రజలకు కూడా తెలుసు. అంతేకాకుండా నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇపుడు వెనకడుగు వేసి రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు. కాబట్టి మీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. నా ముఖం మాత్రం అక్కడే ఉంది. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నేను నెగ్గాను. అమరావతిపై అపుడు ప్రతిపక్షంలో ఉండి ఇపుడు అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు కాబట్టి.. ఒకవేళ రాజీనామా అంటూ చేయాల్సి వస్తే మీరు, మీ మంత్రివర్గం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. నేను చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎప్పటికి పార్టీకి విధేయుణ్ణి.. పార్టీ ఆనాడు చెప్పిన మాటను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇచ్చిన మాట తప్పారు కాబట్టి.. మీరు రాజీనామా చేసుకోండి. నేను మాత్రం రాజీనామా చేయను’’ అని రఘురామకృష్ణం రాజు ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-raghu-rama-krishnam-raju-sensational-comments-25-104056.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.