మిథున్‌రెడ్డికి సుప్రీం షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్దం చేసిన సిట్

Publish Date:Jul 18, 2025

Advertisement

 

రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడంతో.. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్  చేసిన మిథున్‌రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. మరోవైపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది. పరారీలో ఉన్న మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో  పిటిషన్ వేశారు. 

మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు.  మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించడం, లొంగిపోవడానికి సమయమిచ్చేందుకు నిరాకరించడంలో ఆయన అరెస్ట్ ఖాయమైంది.

లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా.. రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన జస్టిస్ జెబి పార్థివలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరగా.. దానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

By
en-us Political News

  
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్‌గా రెండో సారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ విశ్వసనీయత ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు అనకాపల్లిలో మీడియా సమావేశంలో సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు.
2024 ఎన్నికల ముందు మంగళవారం, అమావాస్య నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు కూటమి పై కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో అమావాస్య నాడు పవన్ చేసిన ఈ కూటమి ప్రకటనపై పులువురి నుంచి అభ్యంతరాలొచ్చాయి. కానీ ఫలితాల తర్వాత తేలింది ఏంటంటే పవన్ అమావాస్య సెంటిమెంట్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అని.
వైసీపీలో పెద్ద సంక్షోభంలో కూరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో పై నుంచి కింది దాకా సజ్జలపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోతున్నది.తాడేపల్లి ప్యాలెస్ గుడ్ లుక్స్ లో ఉండటం వల్ల అది బహిర్గతం కావడం లేదని వైసీపీ నేతలే గుసగులాడుతున్నారు. అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పరిస్థితి చాలా వరకూ మారిపోయిందంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్, రాజేంద్రనగర్. షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదులతో బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కోశాధికారి శ్రీనివాస్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి రాజేంద్రయాదవ్ లకు బెయిలు లభించింది.
ఉన్నత విద్యనభ్యసించి, మంచి భవిష్యత్తు వెతుక్కుంటున్న అమాయకులను కూడా మాజీ సీఎం జగన్ సన్నిహితులు లిక్కర్ స్కాంలో బుక్ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ -47 నిందితుడిగా ఉన్న బెహ్రూన్ షాజిల్ షేక్ పాపం అలాగే కేసులో ఇరుక్కున్నాడు.
ఏ కుల‌మూ నీదంటే గోకుల‌మూ మాదందీ.. అన్న పాట ఒక‌టుంది. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ విష‌యంలో కిష‌న్ రెడ్డి వేసిన ప్ర‌శ్న స‌రిగ్గా అలాగే క‌నిపిస్తోంది. కుల గ‌ణ‌న విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట‌లు ర‌గులుతున్నాయ్.
గోవా గవర్నర్ గా అశోకగజపతి రాజు శనివారం (జులై 25) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో అశోక్ గజపతిరాజుతో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) వ్యవహారాల పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును తెలంగాణ హైకోర్టు నియమించింది.
తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బెంబేలెత్తిస్తోంది. తిరుమతిలో ఓ స్కూటరిస్టుపై చిరుత దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.