Publish Date:Jun 22, 2025
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సునీల్ యాదవ్ పెళ్లి రోజు కావడంతో క్రిష్ణుడి గుడికి వెళ్లి అక్కడి నుంచి తన వాహనంలో ఇంటికి వస్తున్న సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులైన లోకేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్ (వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ )లతోపాటు మరో ఇరువురు వాహనంలో వెంబడించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తన వాహనం ముందు వెళ్తుంటే దాన్ని అనుసరిస్తూ మరో వాహనం వస్తూ ఉండడం గమనించానని తెలిపారు .ఈ వాహనంలో లోకేశ్వర్ రెడ్డి పవన్ కుమార్ ల ను గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు.
తనకు ప్రాణం ఉందని పులివెందుల అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే హత్య సినిమాకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది .ఆ సమయంలో పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారించారు. గతంలో కూడా తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా జరిగిన సంఘటన నేపథ్యంలో మరో సారి తనకు ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు .ఈ ఫిర్యాదు పై పోలీసులు విచారణలో చేయనున్నట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-avinash-reddy-39-200432.html
యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు.
మొహర్రం సందర్బంగా హైదరాబాద్లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే జరిగింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయన అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లా మామిడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై 9న జగన్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వచ్చి ఇక్కడి రైతులను పరమార్శించనున్నారు. కారణం ఈ రైతులకు తగిన ధర లేక అవస్థ పడుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.
బేసిగ్గా జేపీ నడ్డా అధ్యక్ష పదవీ కాలం 2023 జనవరితోనే ముగిసింది. అయితే 2024 లో ఎన్నికల కారణంగా జూన్ వరకూ పొడిగించారు. అప్పటికీ ఏడాది గడచిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం.
తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి.
అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై) ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది.