షర్మిల పాదయాత్రకు జనం కరువు

Publish Date:Mar 30, 2013

Advertisement

 

 

పాదయాత్రలు చేయడం ఒక ఎత్తయితే, దానికి ప్రజలను ఆకర్షించడం మరొక పెద్ద సవాలు. సుదీర్ఘ రాజకీయనుభవం, వివిధ అంశాల పట్ల పూర్తి అవగాహనతో పూర్తి సాధికారికంగా మాట్లాడగలిగిన చంద్రబాబు తన పాదయత్రలో జనాలను బాగానే ఆకట్టుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్, తెదేపాలను దుమ్మెత్తి పోయడమే ప్రధాన లక్ష్యంగా, ‘జగనన్న జైలు నుండి బయటకి వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ చిలక పలుకులు పలికే షర్మిల పాదయత్రలకి మాత్రం ఆ పార్టీ నేతలు జనసమీకరణ కోసం కష్టపడక తప్పట్లేదు అని సమాచారం. స్థానిక నేతల మద్య అవగాహన లోపించినపుడో లేక వారు అశ్రద్ధ చూపినపుడో తప్ప ఇంతవరకు దాదాపు అన్నిచోట్ల ఆమె పాదయాత్రలకు జనం బాగానే ఉన్నారు.

 

అయితే, నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని షర్మిల చేసిన పాదయాత్రలో స్థానిక నాయకుల వైఫల్యం వలన బొత్తిగా జనం కనబడలేదు. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరయిన విజయవాడలో జనం కరువడం చాల విచిత్రం. మిగిలిన అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్కడ జనసమీకరణ చేయకుండానే చాలా భారీ ఎత్తున జనాలు స్వచ్చందంగా తరలివస్తారని అంచనాలు వేయడం వలననేమో స్థానిక నాయకులు కొంచెం అలసత్వం చూపడంతో నిన్న షర్మిల పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది.

 

శుక్రవారంనాడు ఆమె కృష్ణవేణి పాఠశాల వద్ద పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి వైకాపా కార్యకర్తలు, నాయకులూ కూడా చేరుకోవడం ఆలస్యమయ్యే సరికి ఆమె చాలా అసహనం వ్యక్తం చేసారు. కొద్ది సేపటి తరువాత వచ్చిన కొద్ది మంది కార్యకర్తలనే తోడూ చేసుకొని పటమట నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు కేవలం ఐదు నిముషాలలో చేరుకోగలిగారంటే ఆమె పాదయత్రకి జనస్పందన ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును. ఆమె పాదయాత్రలో కనీసం మహిళా నాయకులు కూడా ఎవరూ కనిపించకపోవడం మరో విశేషం.

 

మొత్తం మీద పటమటలంకలో కొద్దిమంది కార్యకర్తలతో సాగిన అరగంటలోపే ముగపోయింది. జనం కనిపించక పోవడంతో దారిలోనే ఉన్నసెయింట్ పాల్ కెథడ్రల్ చర్చిలో గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పటమట, ఆటోనగర్ గేటు మీదుగా పెనమలూరు మండలంలోకి ప్రవేశించారు. అయినా దారిపొడుగునా అదే పరిస్థితి ఎదురవడంతో షర్మిల అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఆమె వెంట నడుస్తున్న వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు కొంచెం ఆందోళనకు గురయినట్లు కనిపించారు.

 

జనాలు రాకపోయినా కనీసం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు కూడా షర్మిల పాదయాత్రకు నిన్న ఎందుకు మొహం చాటేశారో అర్ధం కాక వారు చాల ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ రోజు పాదయాత్రలో మళ్ళీ అటువంటి పరిస్థితి తలెత్తకూడదని ముందు జాగ్రత్త చర్యగా తమ అనుచరులకు చెప్పి తగిన జనసమీకరణ కొరకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.