షర్మిల పాదయాత్రకు జనం కరువు

Publish Date:Mar 30, 2013

Advertisement

 

 

పాదయాత్రలు చేయడం ఒక ఎత్తయితే, దానికి ప్రజలను ఆకర్షించడం మరొక పెద్ద సవాలు. సుదీర్ఘ రాజకీయనుభవం, వివిధ అంశాల పట్ల పూర్తి అవగాహనతో పూర్తి సాధికారికంగా మాట్లాడగలిగిన చంద్రబాబు తన పాదయత్రలో జనాలను బాగానే ఆకట్టుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్, తెదేపాలను దుమ్మెత్తి పోయడమే ప్రధాన లక్ష్యంగా, ‘జగనన్న జైలు నుండి బయటకి వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ చిలక పలుకులు పలికే షర్మిల పాదయత్రలకి మాత్రం ఆ పార్టీ నేతలు జనసమీకరణ కోసం కష్టపడక తప్పట్లేదు అని సమాచారం. స్థానిక నేతల మద్య అవగాహన లోపించినపుడో లేక వారు అశ్రద్ధ చూపినపుడో తప్ప ఇంతవరకు దాదాపు అన్నిచోట్ల ఆమె పాదయాత్రలకు జనం బాగానే ఉన్నారు.

 

అయితే, నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని షర్మిల చేసిన పాదయాత్రలో స్థానిక నాయకుల వైఫల్యం వలన బొత్తిగా జనం కనబడలేదు. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరయిన విజయవాడలో జనం కరువడం చాల విచిత్రం. మిగిలిన అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్కడ జనసమీకరణ చేయకుండానే చాలా భారీ ఎత్తున జనాలు స్వచ్చందంగా తరలివస్తారని అంచనాలు వేయడం వలననేమో స్థానిక నాయకులు కొంచెం అలసత్వం చూపడంతో నిన్న షర్మిల పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది.

 

శుక్రవారంనాడు ఆమె కృష్ణవేణి పాఠశాల వద్ద పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి వైకాపా కార్యకర్తలు, నాయకులూ కూడా చేరుకోవడం ఆలస్యమయ్యే సరికి ఆమె చాలా అసహనం వ్యక్తం చేసారు. కొద్ది సేపటి తరువాత వచ్చిన కొద్ది మంది కార్యకర్తలనే తోడూ చేసుకొని పటమట నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు కేవలం ఐదు నిముషాలలో చేరుకోగలిగారంటే ఆమె పాదయత్రకి జనస్పందన ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును. ఆమె పాదయాత్రలో కనీసం మహిళా నాయకులు కూడా ఎవరూ కనిపించకపోవడం మరో విశేషం.

 

మొత్తం మీద పటమటలంకలో కొద్దిమంది కార్యకర్తలతో సాగిన అరగంటలోపే ముగపోయింది. జనం కనిపించక పోవడంతో దారిలోనే ఉన్నసెయింట్ పాల్ కెథడ్రల్ చర్చిలో గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పటమట, ఆటోనగర్ గేటు మీదుగా పెనమలూరు మండలంలోకి ప్రవేశించారు. అయినా దారిపొడుగునా అదే పరిస్థితి ఎదురవడంతో షర్మిల అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఆమె వెంట నడుస్తున్న వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు కొంచెం ఆందోళనకు గురయినట్లు కనిపించారు.

 

జనాలు రాకపోయినా కనీసం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు కూడా షర్మిల పాదయాత్రకు నిన్న ఎందుకు మొహం చాటేశారో అర్ధం కాక వారు చాల ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ రోజు పాదయాత్రలో మళ్ళీ అటువంటి పరిస్థితి తలెత్తకూడదని ముందు జాగ్రత్త చర్యగా తమ అనుచరులకు చెప్పి తగిన జనసమీకరణ కొరకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

By
en-us Political News

  
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.