షర్మిల పాదయాత్రకు జనం కరువు

Publish Date:Mar 30, 2013

Advertisement

 

 

పాదయాత్రలు చేయడం ఒక ఎత్తయితే, దానికి ప్రజలను ఆకర్షించడం మరొక పెద్ద సవాలు. సుదీర్ఘ రాజకీయనుభవం, వివిధ అంశాల పట్ల పూర్తి అవగాహనతో పూర్తి సాధికారికంగా మాట్లాడగలిగిన చంద్రబాబు తన పాదయత్రలో జనాలను బాగానే ఆకట్టుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్, తెదేపాలను దుమ్మెత్తి పోయడమే ప్రధాన లక్ష్యంగా, ‘జగనన్న జైలు నుండి బయటకి వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ చిలక పలుకులు పలికే షర్మిల పాదయత్రలకి మాత్రం ఆ పార్టీ నేతలు జనసమీకరణ కోసం కష్టపడక తప్పట్లేదు అని సమాచారం. స్థానిక నేతల మద్య అవగాహన లోపించినపుడో లేక వారు అశ్రద్ధ చూపినపుడో తప్ప ఇంతవరకు దాదాపు అన్నిచోట్ల ఆమె పాదయాత్రలకు జనం బాగానే ఉన్నారు.

 

అయితే, నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని షర్మిల చేసిన పాదయాత్రలో స్థానిక నాయకుల వైఫల్యం వలన బొత్తిగా జనం కనబడలేదు. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరయిన విజయవాడలో జనం కరువడం చాల విచిత్రం. మిగిలిన అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్కడ జనసమీకరణ చేయకుండానే చాలా భారీ ఎత్తున జనాలు స్వచ్చందంగా తరలివస్తారని అంచనాలు వేయడం వలననేమో స్థానిక నాయకులు కొంచెం అలసత్వం చూపడంతో నిన్న షర్మిల పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది.

 

శుక్రవారంనాడు ఆమె కృష్ణవేణి పాఠశాల వద్ద పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి వైకాపా కార్యకర్తలు, నాయకులూ కూడా చేరుకోవడం ఆలస్యమయ్యే సరికి ఆమె చాలా అసహనం వ్యక్తం చేసారు. కొద్ది సేపటి తరువాత వచ్చిన కొద్ది మంది కార్యకర్తలనే తోడూ చేసుకొని పటమట నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు కేవలం ఐదు నిముషాలలో చేరుకోగలిగారంటే ఆమె పాదయత్రకి జనస్పందన ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును. ఆమె పాదయాత్రలో కనీసం మహిళా నాయకులు కూడా ఎవరూ కనిపించకపోవడం మరో విశేషం.

 

మొత్తం మీద పటమటలంకలో కొద్దిమంది కార్యకర్తలతో సాగిన అరగంటలోపే ముగపోయింది. జనం కనిపించక పోవడంతో దారిలోనే ఉన్నసెయింట్ పాల్ కెథడ్రల్ చర్చిలో గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పటమట, ఆటోనగర్ గేటు మీదుగా పెనమలూరు మండలంలోకి ప్రవేశించారు. అయినా దారిపొడుగునా అదే పరిస్థితి ఎదురవడంతో షర్మిల అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఆమె వెంట నడుస్తున్న వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు కొంచెం ఆందోళనకు గురయినట్లు కనిపించారు.

 

జనాలు రాకపోయినా కనీసం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు కూడా షర్మిల పాదయాత్రకు నిన్న ఎందుకు మొహం చాటేశారో అర్ధం కాక వారు చాల ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ రోజు పాదయాత్రలో మళ్ళీ అటువంటి పరిస్థితి తలెత్తకూడదని ముందు జాగ్రత్త చర్యగా తమ అనుచరులకు చెప్పి తగిన జనసమీకరణ కొరకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.