తెలంగాణా ఉద్యమనాయకులను తప్పు పట్టిన ఉండవల్లి

Publish Date:Jan 25, 2013

Advertisement

 

 

 

 

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజమండ్రీలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ మహాసభలో మాట్లాడుతూ కేసీర్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులను ఉద్యమం పేరిట ప్రజలమధ్య విద్వేషాలు రగిలిస్తున్నందుకు తప్పుపట్టారు. వారు తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసమే తెలంగాణా ఉద్యమాలు మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలను,రాజకీయ నాయకులను నరుకుతాము, తరిమికొడతామంటూ భయబ్రాంతులకు గురిచేసి ఉద్యామాలు నడిపిస్తున్నారని ఆరోపించారు.

 

 

సముద్రంలో వృధాగా కలిసిపోతున్ననీటిని పంటలకు ఉపయోగపడేవిదంగా తెలంగాణా దిగువనున్నపోలవరం వద్ద ప్రాజెక్టు కడితే, ఎగువనున్న తెలంగాణాకు ఏ విదంగా నష్టం వాటిల్లుతుందో తెలుపమని సవాలు విసిరారు. పోలవరం వల్ల నష్టపోయే గిరిజనుల గురించి కేసిర్ కి ఎంత తాపత్రయం ఉందో తమకీ అంతే ఉందని, నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి వారి జీవితాలు చక్క దిద్దేందుకు కలిసి కృషిచేద్దామని అయన అన్నారు. ఉండవల్లి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా మూడు ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి వివరాలను గణాంకాలతో సహా సభికులకి వివరించారు.

 

 

శాసనసభలో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నంతకాలం గుర్తుకురాని తెలంగాణా, తరువాత ఎందుకు గుర్తుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీర్ చేపట్టిన ఉద్యామలవల్లనే అమయకులయిన విద్యార్దులు చనిపోతుంటే అందుకు తమని నిందించడం ఏమీ న్యాయమని ఆయన ప్రశ్నించారు. చనిపోయినవారు ఎవరి పిల్లలయినా అందరికీ బాధ కలుగుతుంది, అందుకు బాష, ప్రాంతం అడ్డురావని ఆయన అన్నారు.

 

 

కేసీర్, ప్రొఫెసర్ కోదండరాం వివిధ సభలలో ఆంద్ర ప్రాంతవాసులను, మంత్రులను అవహేళను చేస్తూ, బెదిరిస్తూ మాట్లాడిన విడియో క్లిప్పింగులను సభికులకు ప్రదర్శించి చూపిన ఉండవల్లి, ఆంద్ర ప్రజలను ఈ విదంగా అవమానించడం ఏమి సబబు అని ప్రశ్నించారు. తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసమే మొదలు పెట్టిన తెలంగాణా ఉద్యమంలో అమాయకులు, సామాన్యులు సమిదలయి రాలిపోతుంటే ఆయన మాత్రం తన ఉద్యమం కొనసాగించడం దారుణం అని అన్నారు. అయన చెప్పటిన ఉద్యమంలో అయన బంధువులుగానీ, పార్టీకి చెందిన నేతలకి గానీ ఒంటి మీద ఈగ కూడా వాలకపోయినా, అమాయకులయిన విద్యార్దులు మాత్రం అసువులు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

 

 

రాష్ట్ర ప్రజలు కలిసి అభివృద్ధి సాదించాలే తప్ప విడిపోయి బావుకోనేది ఏమి ఉండబోదని ఆయన అన్నారు. రాహుల్ గాందీ మొన్న చింతన శిబిర్ లో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఇంట కాలానికి దేశాన్ని సవ్య దిశలో తీసుకుపోగల నాయకుడు దొరికాడని మెచ్చుకొన్నారు.

By
en-us Political News

  

బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ బ్రెజిల్ శాంటా మారియా నగరంలో జనంతో కిక్కిరిసిన ఓ నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 245 మందికి పైగా మృతి చెందారు. షో కోసం వెలిగించిన నిప్పు వలన ఈ అగ్నిప్రమాదం జరిగిందని షో నిర్వాహకులు చెప్పారు.

తెలంగాణాపై ఇప్పటికిప్పుడు పరిష్కారం అసాద్యం అని గులాం నబీ ఆజాద్ ఈ రోజు తేల్చి చెప్పేయడంతో నెల రోజుల సస్పెన్స్ త్రిల్లర్ సీరియల్ పూర్తయిపోయింది. ఇక, రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దాలు తరువాత దశలో పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, మెజార్టీ వగైరాలు మొదలుకానున్నాయి.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మోకాలి శస్త్రచికిత్సకోసం మద్యలో నిలిపివేసిన తన పాదయాత్రను మళ్ళీ వచ్చేనెల మొదటివారం నుండి ప్రారంబించవచ్చునని ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఈ రోజు మీడియాకి తెలియజేసారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజులు పాదయాత్ర పూర్తీ చేసిన సందర్భంగా ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో స్థానిక పార్టీ నేతలు నిర్మించిన 117 అడుగుల ఎత్తున్న పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన కృష్ణా జిల్లాలో పైలాన్ అవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

అలనాడు బోధీ వృక్షం క్రింద తపస్సుచేసిన గౌతమ బుద్దుడు “కోరికలే దుఃఖమునకు మూల కారణం” అని కనుగొనగలిగేడు. ఇప్పుడు తెలంగాణాలో దుఃఖానికి, అశాంతికి కేసీర్ వంటి నేతల కోరికలే కారణమని మంత్రి వర్యులు శైలజానాథ్ తెలిపారు.

రాజమండ్రిలో జరుగుతున్న జై ఆంధ్రప్రదేశ్ సభలో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ నాయకులు కోరినందువల్లే ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని స్పష్టం చేశారు. ఎవ్వరూ మాయమాటలు చెప్పి తెలంగాణను కలుపుకోలేదు అని ఆయన వివరించారు.

ముంబై పై దాడులకు సంబంధించిన ఉగ్రవాదికి అమెరికా కోర్టు శిక్ష విధించింది. ముంబై దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని షికాగో కోర్టు తీర్పు చెప్పింది. గత ముంబై దాడి ఘటనలో కీలకపాత్ర పోషించి విధ్వంసానికి కారణమైన హెడ్లీకి 35 ఏళ్ల జైలు

ప్రతీ చిన్న విషయానికి అధిష్టానం నిర్ణయం కోసం డిల్లీ వైపు చూసే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో మాత్రం పార్టీ గౌరవ ప్రతిష్టలను మసకబారుస్తూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజలకి మార్గ దర్శనం చేయవలసిన నేతలే ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొడుతూ, వాటిని అడ్డుపెట్టుకొని గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు.

ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై 13 రోజుల పోరాటం అనంతరం ప్రాణాలు వదిలిన ఫిజియోతెరపీ విద్యార్థిని జ్యోతి సింగ్ పాండే చదువులో ఎంత చురుకో తెలియజేసే రుజువిది. ఫిజియోథెరపీ కోర్సు నాలుగో సంవత్సరం పరీక్షల్లో జ్యోతి సింగ్ పాండే కు 72.7 శాతం మార్కులు వచ్చాయి.

”వారమంటే ఏడు రోజులు కాదు. షిండే చెప్పినంత మాత్రాన నెల రోజుల్లో తెలంగాణను ప్రకటించడం కుదరదు. తెలంగాణ సమస్యకు డెడ్ లైన్ అనేది లేదు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారానికి మరింత సమయం పడుతుంది” అని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినంతమాత్రాల ఇప్పుడు ప్రకటన చేయలేం

కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీల మద్య రాజకీయ వైరం పాక్ తీవ్రవాదికి ఆయుధంగా మారింది. రెండు రోజుల క్రితం హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ సంఘ్ పరివారం మరియు భారతీయ జనతాపార్టీలు కలిసి దేశంలో హిందూ ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ హిందూ ఉగ్రవాదులను తయారుచేస్తున్నాయని విమర్శించారు.

ప్రధానితో మీటింగ్ అనంతరం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్ తో సమావేశం అయ్యారు. ప్రధాని దగ్గర శ్రీకృష్ణకమిటీ నివేదిక గురించే ప్రస్తావించిన కాంగ్రెస్ నేతలు ఆజాద్ తో కూడా అదే విషయంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలోని 6వ నిబంధన అమలు చేయాలని

ఒకవైపు ప్రతిపక్షాలవారు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందాలేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మేము చేస్తున్న ఆ కొద్దిపాటి పనులను కూడా చేయనీయకుండా కోర్టులు మాకు అడ్డుపడుతున్నాయని మంత్రివర్యులు కొండ్రు మురళి మోహన్ అభిప్రాయపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.