Publish Date:Jul 12, 2021
ఏ మాట వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోలేనంతకాలం మోసపోతూనే ఉంటాం..మనదేశ ప్రగతికి పని చేసే సైయింటిస్ట్ కంటే.. కాషాయం కట్టి వాడి సొంత ప్రగతికి పనిచేసే బాబాలకే మన దేశం విలువనిస్తారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో సైన్స్ పాఠాల కంటే, మూఢనమ్మకాల పాఠాలు ఎక్కువ చెపుతుంటారు. పిల్లలకు ఏదైనా ఐతే హాస్పిటల్స్ కి పరుగెత్తారు ఏ స్వామి దగ్గరికో సన్యాసి దగ్గరికో పరుగులు తీస్తారు. తాజాగా ఓ కన్నతల్లి అజ్ఞానం.. చీకట్లోకి నెట్టింది.. చివరికి కన్నబిడ్డ మరణానికి దారితీసింది. అలా అని ఆమె మూఢనమ్మకం.. చివరికి తనకు కడుపుకోతను మిగిల్చింది. ఆమె చేసిన ఆ అమాయయకమైన పని.. కళ్లు కూడా తెరవని పసికందును కాటికి పంపింది. బిడ్డకు అనారోగ్యంగా ఉందని, తాంత్రిక విద్య తెలిసిన దానిలా ఓ మహిళా బిడ్డ పొట్టపై ఇనుప చువ్వతో కాల్చింది. వేడి తట్టుకోలేని చిన్నారి తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచింది.
వివరాలలోకి వెళితే.. భిల్వారా జిల్లా, మండల్ బ్లాక్లోని లుహరియా గ్రామంలో రమేష్ బగారియా, ఆయన భార్య లాహరి నివసిస్తున్నారు. వారికి 5 నెలల క్రితం పాప పుట్టింది. ఈ క్రమంలోనే చిన్నారి కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైంది. సరిగ్గా పాలు తాగడం లేదు.. ఎప్పుడు ఏడుస్తూ ఉంది. దీంతో తల్లి చిన్నారిని తీసుకుని హాస్పిటల్ కి పరిగెత్తాల్సిన ఆ తల్లి ఓ తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ, వారి ఊరిలో ఉండే తాంత్రికుడు పక్క వూరు వెళ్లాడని తెలియడంతో.. ఆమె సొంత వైద్యానికి సిద్దమయ్యింది. అదేదో తేలు మంత్రం రానివ్వడు.. పాము నోట్లో పెట్టినట్లు.. తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పొట్టపై కాల్చాలని ఎక్కడో విన్న మాట పట్టుకొని అదే విధంగా చేయడానికి రెడీ అయ్యింది.
ఆలస్యం చేయకుండా బిడ్డను నిద్రపుచ్చి.. నిప్పుల మీద ఇనుము చువ్వను ఎర్రగా కాల్చింది.. ఎర్రగా కణకణ కాలిన ఇనుప చువ్వను పసికందు పొట్టపై అంటించింది. దీంతో పాపకు వ్యాధి నయం అవుతుందని భావించింది. అంత వేడి తట్టుకోలేని చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఏడుపు మొదలుపెట్టింది. దీంతో వెంటనే వారు పసికందును మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ పసికందు తల్లి ఒడిలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mother-mistake-son-dead-25-119411.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.