ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం హైరేంజ్లో ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 40వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీయేఅథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో.. త్వరలోనే మరో 40వేల ఎకరాల భూమిని సమీకరించ బోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు తరహాలో... అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబోతోంది.
అలాగే... రెండు వేల ఐదువందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీని, మరో పాతిక వందల ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. వీటి కోసం దాదాపు 10 వేల ఎకరాలు అవసరం అవుతాయి. ఇందు కోసం భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలా? లేదా అక్విజేషన్ ద్వారా తీసుకోవాలా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయం తీసుకున్న తర్వాత.భూ సేకరణా లేక సమీకరణా అన్న విషయంపై ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే రైతులు మాత్రం ల్యాండ్ పూలింగ్కే మొగ్గుచూపుతున్నారని మంత్రి నారాయణ చెప్పారు. పూలింగ్ అయితే.. 40వేల ఎకరాలు సేకరించాలని... అప్పుడే 10వేల ఎకరాలు మిగుతాయన్నారు. అక్విజేషన్ అయితే.. 10వేల ఎకరాలు సరిపోతాయన్నారు. అయితే.. రైతులకు కూడా మేలు జరగాలి కనుక.. వీలైనంత వరకు ల్యాండ్ పూలింగ్నే ప్రిఫర్ చేస్తామన్నారు మంత్రి నారాయణ.
ఇక... అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో 3వేల 673 కోట్ల వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి ఎల్-1 టెండర్లను సీఆర్డీయే ఖరారు చేసింది. 882కోట్లతో నిర్మించే జీఏడీ టవర్ నిర్మాణాన్ని ఎన్సీసీ, 14 వందల 87 కోట్లతో నిర్మించే హెచ్ఓడీ 1, 2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ అండట్ పల్లంజీ, 13 వందల 4 కోట్లతో నిర్మించే హెచ్ఓడీ 3, 4 టవర్లను ఎల్ అండ్ టీ దక్కించుకున్నాయి. త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. 2014-19 మధ్య రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల నిర్మాణ పనులు జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
మూడేళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో అన్ని నిర్మాణాలను పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్పై కూడా మరో 15 రోజుల్లో క్లారిటీ వస్తుందని.. భూసేకరణ తర్వాత... రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెడతాయని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/more-land-for-amarawathi-39-199208.html
ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.