దావూద్ ఇబ్రహీంపై కంటే జగన్ పైనే ఎక్కువ క్రిమినల్ కేసులు!

Publish Date:Apr 16, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు  వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్  పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.  ఇదే విషయాన్ని ప‌లు  స‌ర్వేలు  వెల్ల‌డించాయి. 2 024 ఎన్నిక‌ల్లో తెలుగుదేం కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని, జ‌గ‌న్  పార్టీకి ఘోర పరాజయం తప్పదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో కోడిక‌త్తి డ్రామా త‌ర‌హా ప్ర‌యోగాల‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ తెర‌పైకి తేబోతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.   మూడు రోజుల కిందట జ‌గ‌న్‌పై జరిగిన గులక రాయి దాడి ఘ‌ట‌న ఇందులో భాగ‌మేన‌ని కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు.  గ‌త ఎన్నికల ముందు జరిగిన  కోడి క‌త్తి, వివేకానంద రెడ్డి హ‌త్య‌  జగన్ పై సానుభూతి వెల్లువెత్తి ఆయన పార్టీ  భారీ మెజార్టీతో అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. తాజాగా అదే త‌ర‌హా ప్ర‌యోగాల‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది మ‌రోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతున్నది.  

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిమిన‌ల్ మైండ్ తో మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పైకి న‌వ్వుతూ క‌నిపించినా.. ప్ర‌తీ విష‌యాన్ని క్రిమిన‌ల్ మైండ్ తో ఆలోచిస్తారని, ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేనని అంటున్నారు. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల అఫిడ‌విడ్ ను చూస్తే ఆయ‌న నేర సామ్రాజ్యం క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యేగా  ఏప్రిల్ 22న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన నామినేషన్ వేయడానికి ముందే ఆయన నేరారోపణలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2019 ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ను రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు త‌న‌ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఎన్నిక‌ల‌ అఫిడవిట్ ప్రకారం సీఎం జ‌గ‌న్‌పై మొత్తం 146   కేసులు ఉన్నాయి.   38 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  వీటిలో 21 కేసులు 2011 సంవత్సరానికి చెందినవి. 13 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి విచారణ లేకుండా అన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే దేశంలోనే డాన్ గా పేరు పొంది విదేశాల‌కు పారిపోయిన దావూద్ ఇబ్ర‌హీం పైనకూడా జ‌గ‌న్ పై ఉన్న‌న్ని క్రిమినల్ లేవని అంటున్నారు.  దావూద్ ఇబ్రహీం విదేశాల‌కు పారిపోకుండా రాజకీయాల్లో చేరిఉంటే, అతను ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడనీ. అధికార అండతో కేసులు విచారణ వరకూ రాకుండా పెండింగ్ లో ఉంచుకోగలిగేవారనీ నాగేశ్వరరావు పోస్టుపై నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు  జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదై ఉన్న ఏ కేసూ విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్న విధానం చూస్తే అలాగే అనిపిస్తోందని అంటున్నారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 2011 మంది అభ్యర్థులు పోటీ చేయగా..వారిలో 334 మంది అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపర్చారు. ఇక 222 మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు మొత్తం 96 మంది ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే క్రిమినల్ కేసులున్న 55శాతం మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 55 మంది అభ్యర్థులు చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగారు. ఓ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న 55 మంది ఎమ్మెల్యేల్లో అధికారిక వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇక తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వారిలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభుత్వాన్ని నడపడం అనే అంశంపై పార్లమెంటులో చర్చ పెట్టాలని గ‌తంలో నేత‌లు డిమాండ్ చేశారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ గత ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి  సమర్పించిన ఎన్నికల అఫిడవిడ్  సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.   

By
en-us Political News

  
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతిలో టిడిపి నేత పులివర్తినానిపై దాడి, తాడిపత్రిలో హింసాత్మక సంఘటనలు, పల్నాడులో చెలరేగిన హింస వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది.
విశాఖ ఓటర్లందరూ గంపగుత్తగా కేఏ పాల్‌కి ఓటేశారు. ఈవీఎంలలో సీరియల్ నంబర్ 14, కుండ గుర్తు పక్కనే వున్న బటన్ నొక్కేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా కేఏ పాల్ విజయం కన్ఫమ్ అయిపోయింది.
ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేనుకున్నారు. మృతుడు శంకర్ శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఏపీలో పోలింగ్ పూర్తయ్యింది. ఓటరు తీర్పు సురక్షితంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలు మరింత భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నాయి. పోలింగ్ పూర్తై మూడు రోజులు గడిచినా రాష్ట్రంలో మాత్రం ఇంకా హై టెన్షన్ వాతావరణం అలాగే ఉంది. రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
కొనకళ్ల సత్యనారాయణకు గుండెపోటు
వైసీపీలో నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై ఆశలు ఇసుమంతైనా కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్ నుంచి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల వరకూ అందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అంబటి వంటి ఒకరిద్దరూ, ఇంత కాలం పార్టీకీ, ప్రభుత్వానికీ సలహాలిచ్చిన సజ్జల మాత్రం ఎన్నికల సంఘంపైనా, పోలీసులపైనా విమర్శలు గుప్పిస్తూ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు.
సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవాలు చెప్పేస్తున్నారు. సూటిగా కాకున్నా సూచనలు, సలహాలంటూ రాష్ట్రంలో వైసీపీ మరో సారి అధికారం చేపట్టే అవకాశం లేదని పార్టీ క్యాడర్ ను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. గెలుపు ఓటములపై బెట్టింగులకు పాల్పడి నష్టపోవద్దంటూ పార్టీ కార్యకర్తలకు సూచలను ఇస్తున్నారు. సలహాలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పలు జల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మే 19 నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి, ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి కలిగిస్తున్నది కడప లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడప లోక్ సభ నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడతాయి. ఆ లోగా ఏ పార్టీని విజయం వరిస్తుందన్న అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంతే అంత కంటే ముందు రాష్ట్రంలో విజయం తెలుగుదేశం కూటమిదా? వైసీపీదా అన్న విషయాన్ని సాధికారికంగా ఎవరూ చెప్పే అవకాశం లేదు.
భార‌త‌ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ అయిన‌ ప్రకాశ్ కాప్డే (39).. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి స్వ‌గ్రామానికి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.