తిరుమల భద్రంగా లేదా.. మరింత అలర్ట్ గా ఉండాలన్న డీజీపీ ఆదేశాల అర్దం అదేనా?

Publish Date:May 30, 2025

Advertisement

తిరుమల తిరుపతి భద్రతకు ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న హరీష్ కుమార్ గుప్తా.. దర్శనానంతరం తిరమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో జే.శ్యామలరావు, సీవీఎస్ వో తదితరులతో ఆయన నిర్వహించిన సమావేశంలో తిరుమల భద్రత విషయంలో మరింత అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులనను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.  భక్తుల రక్షణ, ఆలయ భద్రత విషయంలో   స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు.  

తిరుమల  హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. ఐదంచెల భద్రతా వ్యవస్థ 224 గంటలూ అప్రమత్తంగా ఉంటుంది.  రిజర్వు బెటాలియన్, ఏపీఎస్పీదళాలు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ , ఆ తరువాత ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధీటుగా ఎదుర్కొని, క్షణాల్లో అదుపుచేసే శక్తిసామర్థ్యాలు ఉన్న అక్టోపస్ దళాలు ఎల్లవేళలా తిరుమలలో సిద్ధంగా ఉంటాయి. అయినా కూడా భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో భద్రత విషయంలో సమావేశంలో తిరుపతి   టీటీడీ ఇన్ చార్జ్  సీవీఎస్ ఓ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమల భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆయన డీజీపీకి వివరించారు.   

By
en-us Political News

  
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
బోయింగ్ 787 విమానం.. గాల్లోకి ఎగిరిన 30 సెకన్లకే.. తాము భోంచేస్తున్న సమయంలో వచ్చి మీద పడి.. తమ వారి ప్రాణాలను పట్టుకుపోతుందని వారు అస్సలు ఊహించలేదు.
అహ్మదాబాద్‌ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం ఘటనపై టాటా గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం టాటా గ్రూప్ ప్రకటించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ధృవీకరించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంఘటనా స్థలాన్ని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానం కూప్పకూలిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ప్రమాద ఘటన వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు.
ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ మాలిక్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సీటు ఏ11 ప్రయాణికుడు నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి.
విమానం ఎక్కాలంటేనే కాదు, దిగాలన్నా అదృష్టం ఉండాలి... ఇది ఏదో సినిమాలో డైలాగు. ఈ రోజు అది నిజమని మరో మారు రుజువైంది.
గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి అవకాశం లేదని ఆయన అసోసియేట్ ప్రెస్‌తో అన్నారు. ఆ విమానంలో మొత్తం 242 మంది ఉండగా.. వారంతా దాదాపు చనిపోయి ఉంటారని పరోక్షంగా వెల్లడించారు.
కూటమి సర్కార్ ఏడాది పాలన సభ కార్యక్రమం వాయిదా పడింది. ఏడాది పాలన పూర్తి సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో తన అకౌంట్ డీపీ & కవర్ పీక్‌ను నలుపు రంగులోకి మార్చింది. కాగా ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై నెట్టింట విమర్శస్తున్నాయి.
అహ్మదాబాద్- లండన్ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలింది. దీంతో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్‌‌ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను వెంటనే రంగంలోకి దింపినట్లు ట్వీట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.