మొరార్జి టు విజ‌య్...మైనార్టీ ప్ర‌భుత్వాలు వాటి ప‌ర్యావ‌స‌నాలేంటి?

Publish Date:May 10, 2026

Advertisement

 

మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు. అది మొత్తం  పార్ల‌మెంటు ఆమోదం ద్వారా తీసుకునే నిర్ణ‌యం. ఈ స్ఫూర్తి ఇలా ఉంటే, ఒక ప్ర‌భుత్వంలోనే ఒక మినీ పార్ల‌మెంటు అంటే, వివిధ పార్టీల క‌ల‌య‌క ఉంటే అది మ‌రో ర‌క‌మైన స‌మ‌స్య‌గానూ మారుతుంది.

ఆనాటి మొరార్జిదేశాయ్  నుంచి నేటి విజ‌య్ వ‌ర‌కూ.. సంకీర్ణ ప్ర‌భుత్వాల పుట్టినిల్లు కేర‌ళతో క‌లుపుకుని చూస్తే.. సంకీర్ణ ప్ర‌భుత్వాలేంటి?  భార‌త్ లో వాటి చ‌రిత్ర ఏంటి?  ఎదుర్కునే  స‌వాళ్లు ఎలాంటివి సోదాహ‌ర‌ణ‌గా గ‌మ‌నిస్తే.. మ‌న‌కు అనేక అంశాలు క‌నిపిస్తాయి. 

భారతీయ రాజకీయాల్లో సంకీర్ణ శకం అనేది ఒక అనివార్యమైన మలుపు. మొరార్జి దేశాయ్ కాలం నుంచి నేటి విజయ్- టీవీకే వరకు రాజకీయాల్లో అధికారం పంపిణీ అయ్యే తీరు మారింది. ఒకప్పుడు ఒకే పార్టీ ఆధిపత్యం ఉంటే, ఇప్పుడు అనేక‌ ప్రాంతీయ శక్తులు కేంద్ర బిందువులుగా మారాయి. ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వాల చరిత్ర, భారత్ లో పరిణామ క్రమం మొత్తం మూడు ప్రధాన దశలుగా చూడవచ్చు..

ప్రారంభ దశ 1977-1989 నాటిది. కాంగ్రెసేతర పక్షాలన్నీ కలిసి 1977లో  జనతా పార్టీగా ఏర్పడి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఏర్పాటు చేశాయి. అయితే, అంతర్గత కుమ్ములాటలతో ఇది రెండేళ్లకే కుప్పకూలింది.

1989-1999 మ‌ధ్య కాలానికి వ‌స్తే.. 1991లో పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహించినా, బయటి నుంచి మద్దతు కూడగట్టుకుని ఐదేళ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన యునైటెడ్ ఫ్రంట్.. ద్వారా ఏర్ప‌డ్డ‌ దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్  ప్రభుత్వాలు మద్దతు ఉపసంహరణల వల్ల తక్కువ కాలం మాత్ర‌మే పనిచేశాయి.

స్థిరమైన సంకీర్ణాల దశ 1999-2014గా చెప్పాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని NDA 24 పార్టీల‌ను క‌లుపుకుని.. సంకీర్ణ ధర్మాన్ని పాటించి, ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని- UPA పదేళ్ల పాటు సంకీర్ణ పాలన సాగించింది.

ఇక‌ కేరళను.. సంకీర్ణ ప్రభుత్వాల పుట్టినిల్లుగా చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళలో దశాబ్దాలుగా సంకీర్ణాలే రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నాయి. అక్కడ LDF, UDF అనే రెండు బలమైన కూటములు ఉన్నాయి.

చిన్న చిన్న పార్టీలు కూడా ఈ కూటముల్లో చేరి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కేరళ మోడల్ ఏంటంటే—రాజకీయంగా విబేధించినా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా పాలన సాగించడం.

సంకీర్ణ ప్రభుత్వాలు ఎదుర్కొనే సవాళ్లు ఎలాంటివో ప‌రిశీలిస్తే.. సంకీర్ణ పాలన అనేది కత్తి మీద సాము లాంటిది. ఇందులో ప్రధానంగా మూడు రకాల సవాళ్లు ఉంటాయని చెప్పాల్సి  ఉంటుంది.  

ఏదైనా పెద్ద నిర్ణయం ఫ‌ర్ స‌పోజ్.. ఆర్థిక సంస్కరణలు లేదా విదేశీ పెట్టుబడుల విష‌యంలై డెసిష‌న్ తీసుకోవాలంటే అన్ని మిత్రపక్షాలు ఒప్పుకోవాలి. ఒక్క పార్టీ అడ్డుపడినా ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. ఉదాహ‌ర‌ణ‌కు UPA-1 కాలంలో లెఫ్ట్ పార్టీల ఒత్తిడి వల్ల అణు ఒప్పందంలో తీవ్ర జాప్యం జరిగిన‌ట్టు.

చిన్న పార్టీలు తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం లేదా పదవుల కోసం మద్దతు ఉపసంహరించుకుంటామని కేంద్రాన్ని బెదిరిస్తుంటాయి.  గతంలో జయలలిత AIADMK  వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో పడగొట్ట‌గ‌లిగింది. 

సంకీర్ణ  ప్ర‌భుత్వాల్లో ఉమ్మడి కనీస ప్రణాళిక- CMP అత్య‌వ‌స‌రం. విభిన్న సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్, ముస్లీం లీగ్, ద‌ళిత వ‌ర్గాల‌కు చెందిన‌ పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు ఎవరి ఎజెండా అమలు చేయాలనే దానిపై నిరంతరం సంఘర్షణ చెల‌రేగుతుంది.

తమిళనాడులో విజయ్ ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా ఒక కొత్త  కూటమిని నిర్మించాలని చూస్తున్నారు. ఇందులో విజ‌య్ ఎదుర్కునే ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఏంటంటే.. ఒకవైపు మిత్రధర్మాన్ని పాటించాలి, మరోవైపు తన సొంత ఉనికిని సైతం కాపాడుకోవాలి.

విజయ్ వంటి కొత్త నాయకులకు సంకీర్ణ నిర్వహణ అనేది పరీక్షా సమయం. ఎందుకంటే, అధికారం పంచుకోవడం అనేది కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, బాధ్యతల పంపిణీ కూడా.

భారతదేశం వంటి భిన్నత్వంతో కూడిన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రతిబింబాలు. ఇవి ఏ ఒక్క పార్టీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి. కానీ, అది సమర్థవంతమైన పాలన  దారి తీస్తుందా లేక  అస్థిరతకు కార‌ణ‌మ‌వుతుందా? అనేది ఆ కూటమిని నడిపే నాయకుడి నేతృత్వంపై ఆధారపడి ఉంటుంది. పీవీ నరసింహారావు తన మేధస్సుతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినట్లు, విజయ్ తన సినీ బుర్ర‌తో సంకీర్ణాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఒక సినిమా అంటేనే- 24 క్రాఫ్ట్ ల స‌మాహారం. సినిమాల నుంచి వ‌చ్చిన విజ‌య్ కి ఈ మాత్రం తెలియంది కాదు. తానొక హీరోగా  నిర్మాత‌ల‌పై ఎన్నో డిమాండ్ల‌తో ఒత్తిడి తెచ్చి ఉంటారు. ఇప్పుడాయ‌న త‌న సంకీర్ణ ప్ర‌భుత్వానికి తానే ఒక‌ నిర్మాత వంటి వారు. మ‌

రి ఒక‌టీ అరా సీట్లిచ్చి కూడా భారీ ఎత్తున ప్ర‌యోజ‌నాల‌ను కోరే వారిని ఆయ‌న ఎలా  శాంత ప‌రుస్తారు? ఎలాంటి  టెక్నిక్స్ ఫాలో అవుతారు? ఎలాంటి ప్ర‌య‌రోగాలు చేసి వారిని కంట్రోల్లోకి తెచ్చుకుంటార‌న్న నాట‌కం ఇక ముందు ముందు రంజుగా మార‌నుంద‌ని మాత్రం అంటున్నారు. మ‌రి చూడాలి.. ఈ అనుభ‌వ రాహిత్యంతో కూడిన సినీ హీరో ట‌ర్న‌డ్ పొలిటీషియ‌న్ ఉద్దండ  పిండాలైన ఈ సీనియ‌ర్ త‌మిళ‌ పొలిటీషియ‌న్ల‌ను ఎలా దారిలోకి తెస్తారో తేలాల్సి ఉంది. అన్నిటిక‌న్నా  ముందు.. త‌న హామీల‌ను ఆయ‌న ఎలా నెర‌వేర్చుతార‌న్న‌ది కూడా  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్  ని త‌ల‌పిస్తోంది.


 

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.