వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత చాలా మంది నేతలు పార్టీకి దూరం జరగడమో, రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడమో చేశారు. ఇక వేరే మార్గం లేని పలువురు పార్టీలో ఉన్నా తామరాకు మీద నీటిబొట్టు మాదిరి పార్టీ వ్యవహారలలో ఇసుమంతైనా జోక్యం లేకుండా మౌనాన్ని ఆశ్రయించారు.
గతంలో జగన్ పై చిన్న పాటి విమర్శను కూడా సహించలేమంటూ ప్రత్యర్థులపై బూతుల వర్షం కురిపించిన నేతలు కూడా ఇప్పుడు నోటికి తాళం వేసుకున్నట్లుగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలోలా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపితే దానికి మీడియా ముందు చదివేయడానికి రెడీగా ఉన్న నాయకులు వైసీపీలో వేళ్ల మీద లెక్కించవచ్చు. అదే గతంలో అయితే ఇలాంటి వారి సంఖ్య లెక్కకు మించి ఉండేది.
సరే ప్రస్తుతానికి వస్తే రాజ్యసభలో జగన్ పార్టీ బలం రోజురోజుకూ పడిపోతోంది. ఉన్న 13 మందిలో నలుగురు ఇప్పటికే తమ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. గతంలోనే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, ఇటీవలే ఆ పార్టీ కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి రాజీనామా చేసి పార్టీని వీడారు.
ఈ నేపథ్యంలోనే జగన్ గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడి వెళ్లిన వారికి క్యారెక్టర్ లేదంటూ విమర్శించారు. దీనిపై అనూహ్యంగా విజయసాయిరెడ్డి నుంచి స్ట్రాంగ్ రిటార్డ్ వచ్చింది. తనకు క్యారెక్టర్ ఉంది కనుకనే మీ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అని ట్వీట్ చేశారు. నా క్యారెక్టర్ సరే మీకు క్యారెక్టర్ ఉందా అని జగన్ ను నిలదీసినట్లుగా విజయసాయి ట్వీట్ ఉంది.
ఇక విజయసాయి ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన మరో నాయకుడు మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఆయన కూడా తన క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని పేర్కొన్నారు. జగన్ తో పాటు ఆయన అక్రమాస్తుల కేసులో తాను కూడా జైలుకు వెళ్లి వచ్చానని పేర్కొన్న మోపిదేవి.. నిజంగా ఒత్తిళ్లకు లొంగిపోయే విడినైతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునే వాడినే కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరూ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నెటిజనులు జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం అడిగి మరీ తిట్టించుకోవడానికే అన్నట్లుగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mopidevi-venkataramana-stromg-counter-to-jagan-39-192516.html
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.