అసలు మోపిదేవి.. జగన్ మధ్య ఏం జరిగింది?

Publish Date:Aug 30, 2024

Advertisement

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం రాజకీయంగా ఒకింత సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచిన మోపిదేవి వెంకట రమణ.. పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉ:టూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు. అటువంటి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలలో రానున్న భారీ మార్పులకు సంకేతంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ, పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీకి ముఖచిత్రంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ కూడా ఆయన జగన్ కు విధేయంగా ఉంటూ వచ్చారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. 

పార్టీకీ రాజీనామా చేసుంతగా మోపిదేవిలో జగన్ పట్ల అసంతృప్తి పేరుకుపోవడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తనకు కానీ, తన సోదరుడికి కానీ జగన్ టికెట్ నిరాకరించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మోపిదేవి పలు మార్లు కోరినప్పటికీ రేపల్లె నుంచి మోపిదేవికి టికెట్ నిరాకరించే విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలాగే ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేడయంతో మోపిదేవికి అవమానకరంగా మారింది. అంతే కాకుండా పార్టీ వ్యవహారాలలో కూడా మోపిదేవికి ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక పార్టీ పరాజయం తరువాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఫలితాల తరువాత నుంచీ మోపిదేవి వైసీపీకి గుడ్ బై చెబుతారన్న టాక్ పోలిటికల్ సర్కిల్స్ లో వినబడుతూనే ఉంది.

 ఇప్పుడు తెలుగుదేశంలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఆయన రాజకీయ విధేయతలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నది అవగతమౌతోంది.  
ఇంతకీ మోపిదేవి చంద్రబాబుతో టచ్ లోకి ఎలా వెళ్లారంటే రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబుతో మోపిదేవి సమావేశమయ్యేందుకు సహకరించారు. ఆ సమావేశంలో మోపిదేవి వెంకటరమణతో పాటు మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇరువురూ కూడా వైసీపీకి, తమతమ రాజ్యసభ సభ్యత్వాలకూ రాజీనామా చేశారు. ఏ క్షణంలోనైనా తెలుగుదేశం కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి.  మొత్తం మీద మోపిదేవి వంటి విధేయుడే  దూరం అవ్వడం పార్టీలో జగన్ నాయకత్వంపై అవిశ్వాసం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తనకు బలం ఉందని భావిస్తున్న రాజ్యసభలోనూ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ కూడా వైసీపీకి రానున్న రోజులలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. 

By
en-us Political News

  
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.