డ్రగ్స్ కేసు ఆరుగురికి పాజిటివ్....ఈగల్ టీం ఎస్పీ గిరిధర్

Publish Date:Mar 15, 2026

Advertisement

 

హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రగ్స్ వినియోగంపై నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు రితేష్‌రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగిటివ్ వచ్చినప్పటికీ, అనంతరం చేసిన బ్లడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఎస్పీ పేర్కొన్నారు. 

ఇక ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్ హౌస్‌ను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. చేవెళ్ల ఆర్డీవో నేతృత్వంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. సిపి యాక్ట్ ప్రకారం ఫామ్ హౌస్‌ను సీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఈ ఫామ్ హౌస్‌లో తరచుగా డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులు, పార్టీల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై విచారణ సాగుతోంది.

By
en-us Political News

  
నేటి డిజిటల్ కాలంలో యూపీఐ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ మరియు స్క్రీన్ షేరింగ్ మోసాల నుండి మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎలా కాపాడుకోవాలో, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
కాక్రోచ్ జనతాపార్టీ విడుదల చేసిన ఒక ప్రకనటలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశ యువత అంటే జన్ జీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి భ‌య‌ప‌డ‌టం లేద‌ని పేర్కొంది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ తో గురువారం (జూన్ 11) పూణేలో ఆందోళ‌న చేప‌ట్టింది. ఆ త‌రువాత ల‌క్నో, అమృత్‌స‌ర్‌, బెంగ‌ళూరు, జైపూర్‌, హైద‌రాబాద్‌లో కూడా ఆందోళ‌న‌లు నిర్వహిస్తామనీ, ఈ నెల 13లోగా కేంద్ర మంత్రి రాజీనామా చేయ‌క‌పోతే జూన్ 20న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక ధ‌ర్నా చేప‌డ‌తామ‌ని పేర్కొంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోగా, ఐటీ రంగ షేర్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ బ్యాంకింగ్ రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు యూపీఐ మోసాల వల్ల ఎదురవుతున్న తీవ్ర నష్టాలు మరియు సైబర్ ముప్పుల గురించి బయోక్యాచ్ (BioCatch) తాజా నివేదిక వెల్లడించిన షాకింగ్ గణాంకాలు మీకోసం.
బెంగళూరు నమ్మ మెట్రో ఫేజ్-3 డబుల్ డెక్కర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయింది. రూ.9700 కోట్ల అదనపు వ్యయంతో ఒకే పిల్లర్‌పై నిర్మించే ఫ్లైఓవర్, మెట్రో రూట్ మ్యాప్ మరియు 32 మీటర్ల ఎత్తైన స్టేషన్ వివరాలు ఇక్కడ చూడండి.
మమఎర్త్ మాతృసంస్థ హోనాసా కన్స్యూమర్ ఆర్థిక సంవత్సరం 2031 నాటికి రూ.5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రకటించడంతో షేర్లు 6% పైగా పెరిగాయి. ఈ స్టాక్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన తాజా రేటింగ్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. ఐదో సీడ్ చియు పిన్ చైన్ పై అద్భుత పోరాటంతో గెలిచింది. పీవీ సింధు, మాళవిక కూడా తదుపరి రౌండ్ కు దూసుకెళ్లారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అఫ్గానిస్థాన్-Aతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి, 200 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, నిర్లక్ష్యపు షాట్‌తో హాఫ్ సెంచరీని ఎలా చేజార్చుకున్నాడో పూర్తిగా చదవండి.
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.