Publish Date:Oct 19, 2022
మంచివారు ఎవరన్నది చర్చగా మారిపోతోంది. జైలు జీవితం గడుపుతున్నంత మాత్రాన వారంతా చాలా మంచివారుగా, సత్ప్రవర్తనతో తమ జీవితాన్ని కొనసాగిస్తారని బీజేపీ అభిప్రాయం కావచ్చునేమోగాని విప క్షాలు అలా భావించడం లేదు. కేవలం తమ అధికారం చలాయించడానికి అడ్డుగోడలను తొలగించు కోవ డానికే ఇలాంటి ప్రచారాలు చేయడం తప్ప వాస్తవానికి సమాజంలో జరుగుతున్నది విరుద్ధమన్నది విప క్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా బిల్కిస్బానో కేసులో ఇటీవల పదకండు మంది నిందితులు ఎంతో మారిపోయారంటూ విడుదల చేయడం పై పెద్ద దుమారమే లేచింది. తాజాగా ఏఐఎంఐఎం అధి నేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడుతున్నారు.
బిల్కిస్ బానో కేసుకి సంబంధించి 11మంది నిందితులను విడుదల చేశారు. అయితే ఇది కేంద్ర హోం మంత్రి ఆదేశం మేరకే జరిగిం దన్న విమర్శలు ఇంకా ఉన్నాయి. బుధవారంనాడు గుజరాత్లో డిఫెన్స్ ఎక్స్పో 2022 ఆరం భోత్సవం సంద ర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశం పావురాళ్లను ఎగరే యడం నుంచి పులులను విడుదల చేసే స్థితికి వచ్చిందని అన్నారు. దీనికి ఏఐఎంఐఎం ఛీఫ్ అసదు ద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.
ప్రధాని ప్రకటనలో చీటాలతో పాటు రేపిస్టులను కూడా ఆ జాబితాలో చేర్చాలని అసదుద్దీన్ విమర్శనా స్త్రం సంధించారు. ఇపుడు ఇది తీవ్ర ప్రకంపనలకు దారితీస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేవలం చిరుతల నే కాదు అత్యాచారాలను చేసేవారికి కూడా స్వేచ్ఛనిస్తోందని ఓవైసీ ఎద్దేవా చేశారు. బిల్కిస్ బానో కేసులో 11 మందికి స్వేచ్ఛనీయడంలో అర్ధమేమంటని ప్రశ్నించారు. వారిని విడుదల చేయడం సీబీఐ కూడా వ్యతిరేకించినప్పటికీ వారిని విడుదల చేశారని ఓవైసీ మండిపడుతున్నారు. వారి ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చిందని, చాలా మంచివారిగా మారిపోయారనీ, పైగా వారి జైలు శిక్ష సమయం పూర్తిగా అను భవించారంటూ 11మందినీ విడుదల చేసినట్టు ప్రకటించారని గుజరాత్ ప్రభుత్వం పేర్కొన్నది. వారిలో ఒకరయిన మితేష్ చిమన్లాల్ భట్ పెరోల్ సమయంలో 2020ల జూన్లో ఒక మహిళపై అత్యా చారం చేశాడని తెలిసింది.
అసలు మంచిప్రవర్తన, మంచిగా మారాడన్నదానికి అర్ధమేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎం.పీ మహువా మైత్ర ప్రశ్నించారు. అచ్చేదిన్, అచ్చేలోగ్, బేటీకో బచావో అంటూ బీజేపీ, మోదీ సర్కార్ విజయాలకు ప్రచారం చేసుకుంటున్నపుడు ఈ విధమైన ప్రవర్తన కూడా మీకు ఎంతో మంచి ప్రవర్తనే అవుతుందా అని ఎంపీ ప్రశ్నించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సంస్కారవంతులుగా మారిన రేపిస్టులకు స్వేచ్ఛా జీవితం ప్రసాదిస్తామని బీజేపీ తన మానిఫెస్టోలోనే పేర్కొంటుందేమో అని ఆమె ఎద్దేవా చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modiji-39-145694.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.