మోడీ, షాలకు ఏపీ గండం?

Publish Date:Sep 26, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదో ఒక మేరకు పట్టు సాధించాలంటే.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం ఒక్కటే మార్గం అని కమలం అధినేతలు తలపోశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు వెనకాల ఉన్నది బీజేపీ వ్యూహమేనని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో తమ అధికారం పదిలంగా ఉండాలన్నా.. ఏపీలో తమ పెత్తనం సాగాలన్నా చంద్రబాబును రాజకీయంగా బలహీన పరచడం ఒక్కటే మార్గమని మోడీ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఏపీలో జగన్ సర్కార్ అడ్డగోలు విధానాలకూ, పరిమితులకు మించిన అప్పులకూ, నియమనిబంధనలకు తిలోదకాలిచ్చి సాగిస్తున్న అరెస్టులకు అనుమతులు ఇస్తూ.. ఏపీలో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను, పతనమౌతున్న జగన్ ప్రతిష్టను వేడుక చూస్తున్నట్లు కమలనాథులు చూస్తున్నారని అంటున్నారు. 

అయితే బీజేపీ రాష్ట్ర శాఖ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హై కమాండ్ కు నివేదికలు అందిస్తుండటంతో.. ఏమో ఎటువైపు పోయి ఎటువైపు వస్తుందోనన్న జంకుతో ఇప్పటి వరకూ తెలుగుదేశంతో పొత్తు అంశాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చింది. అడపాదడపా చంద్రబాబను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ద్వారా పోత్తు అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇవ్వడం, అదే సమయంలో జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులకు సై అంటూ.. ఏపీలో బీజేపీ డ్యుయెల్ రోల్ పాటిస్తూ వచ్చింది. 

అయితే ఎప్పుడైతే స్కిల్ స్కామ్ పేరిట చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ అధినాయకత్వం ఖండించలేదో.. అప్పుడే సర్వులకూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పూర్తిగా బోధపడింది. దీంతో ఏపీలో బీజేపీ స్టేక్ పూర్తిగా జీరో అయ్యింది. నోటీతో పోటీపడి గత ఎన్నికలలో తెచ్చుకున్న ఒక శాతం ఓటు కూడా ఈ సారి అనుమానమే అంటున్నారు. 

వాస్తవానికి ఏపీలో తమకు ఉన్నదీ, పోయేదీ ఏమీ లేదని కమలనాథులకు స్పష్టంగా తెలుసు.. అయినా జనసేనానిని మిత్రుడిగా చెప్పుకుంటూ.. ఆయనను సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి వెనకుండి డ్రామా నడిపిద్దామనుకున్న కమలం అధినేతలకు తన పయనం తెలుగుదేశంతోనే.. కలిసి వస్తుందా? రాదా? అన్నది బీజేపీ ఇష్టం అంటూ పవన్ కల్యాణ్ కుండబద్దలు కొటేయడంతో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలూ పూర్తిగా దెబ్బతిన్నాయి. 

ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సింగిల్ గా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన మెజారిటీ వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. అంతే కాకుండా.. బీజేపీ ఏతర కూటమి ఇండియా.. సమష్టిగా ఉంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో సొంతంగా ఓ పుంజీడు స్థానాలు తెచ్చుకోగలిగిన పార్టీలు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితిది. అందుకే ఏపీలో ఎటు పోయి ఎటు వచ్చినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు తెచ్చుకుని తెలుగుదేశం అధికారంలోకి రావడమే ఖాయంగా అత్యధిక పార్లమెంటు స్థానాలలో కూడా విజయం సాధించి.. కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయన్న పరిశీలకుల విశ్లేషణలు బీజేపీని గాభరాపెడుతున్నాయి. ఆ కారణంగానే స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ సర్కార్ కు వెనుకనుంచి అవసరమైన అండదండలందించిందనీ, ఎన్నికల సమయంలో చంద్రబాబు జైలులో ఉంటే పార్టీని ముందుండి నడిపించే సారథి అందుబాటులో లేని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు పకడ్బందీగా సమాయత్తం కాలేదనీ, అలాగే బాబు ప్రెజెన్స్ లేకుండా తెలుగుదేశం, జనసేనల మధ్య సీట్ల సర్దు బాటు, ఓట్ల బదలీ సజావుగా సాగే అవకాశం ఉండదనీ బీజేపీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అయితే బీజేపీ ఆశించినదానికి భిన్నంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలలోనూ కూడా ఆందోళనలు మిన్నంటలం, ఆఖరికి సొంత పార్టీ నేతల నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వెలువడటంతో బీజేపీ కంగుతింది. అన్నిటికీ మించి చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కారు.. ఆయన నిర్దోషిగా, స్వచ్ఛంగా బయటకు వస్తారు అని బీజేపీ సీనియర్ నేత.. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో మోడీ, షాల మౌనం వెనుక ఉన్న కుట్ర కోణం బహిర్గతమైందని అంటున్నారు. ఇక ఇప్పుడు  ఏపీలో బీజేపీ ఎదుగుదల సంగతి పక్కన పెడితే ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  రాజకీయ స్వార్థంతో.. ఒక బలమైన పార్టీని బలహీనం చేయాలన్న దురుద్దేశంతో బీజేపీ ఆడిన కుట్ర క్రీడకు ఆ పార్టీయే బలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.