నీరో చక్రవర్తిలా ప్రధాని మోడీ తీరు

Publish Date:Jun 19, 2022

Advertisement

దేశం తగులబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారని విన్నాం.. కానీ ప్రధాని నరేంద్రమోడీ తీరు చూస్తుంటే సరిగ్గా నీరో చక్రవర్తే గుర్తుకొస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ..నమో అంటూ అభిమానుల చేత ప్రశసంలు అందుకుంటుంటారు. అయితే ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఇటీవలి కాలంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, అమలు చేస్తున్న ప్రతి విధానం ప్రజలలో అసంతృప్తికి, ఆగ్రహానికీ కారణమౌతూనే ఉంది. అయితే ఆయన మాత్రం తన విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకించే వారంతా దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారే అంటు ఎదురుదాడి రాజకీయంతో అణచివేయాలని చూస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయం తీసుకున్నా..ఇప్పుడు అగ్నిపథ్ పథకాన్ని తీసుకున్నా.. ఆయన తీరు ఒకేలా ఉంది. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నా మోడీ మాత్రం నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయింపు లాంటి మాటలే మాట్లాడుతున్నారు. రైతు చట్టాల విషయమే తీసుకుంటే.. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా, ఎటువంటి చర్చకు తావివ్వకుండా.. పార్లమెంటులో ప్రవేశ పెట్టి విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా సభలో మంద బలంతో ఆమోదింప చేసుకున్నారు. ఈ విషయంలో విపక్షాల అభ్యంతరాలు, సూచనలను అసలు పరిగణనలోనికే తీసుకోలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ ఉద్యమం చేశారు. హస్తిన సరిహద్దుల్లో టెంట్లు వేసి ఆందోళనలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆయన మౌనముద్ర వీడలేదు. అనివార్యంగా రైతు ఉద్యమం గురించి మాట్లాడాల్సి వచ్చినా కొన్ని శక్తులు రైతులను పక్కతోవ పట్టిస్తున్నాయన్న మాటనే పదే పదే వల్లె వేశారు తప్ప.. వారి వ్యతిరేకత వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఒక వైపు రైతు ఉద్యమం ఉదృతంగా సాగుతుండగానే ఆయన విదేశీ పర్యటనలతో కాలం గడిపేరు. యథా రాజా.. అన్న చందంగా మోడీ ఇలా మొండిగా వ్యవహరిస్తుంటే.. ఆయన కేబినెట్ లోని మంత్రులు సైతం అదే విధంగా ఇష్టారీతిన రైతుల ఉద్యమంపై విమర్శలు గుప్పించారు. విపక్షాలను నిందించారు. దేశంలో రైతు బాగుపడటం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేదని విమర్శించారు. రైతుల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని అనడానికీ వెనుకాడలేదు. సరే ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ మోడీ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. 
ఇప్పుడు అగ్నిపథ్ విషయంలోనూ అంతే.. ఒక విధాన నిర్ణయం తీసుకునేటప్పడు విపక్షాలతో చర్చించడం కానీ, సభలో ప్రవేశ పెట్టి సమగ్ర చర్చ జరపడం కానీ లేకుండానే.. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్నిపథ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించేశారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభం కాగానే ఆయన గతంలోలానే ఇది దేశ ప్రగతిని ఓర్వలేని శక్తులు నడిపిస్తున్న ఉద్యమం అంటూ ఓ విమర్శ చేసేసి తన స్వరాష్ట్రంలో పర్యటనకు వెళ్లిపోయారు. సరిగ్గా సాగు చట్టాల విషయంలో వ్యవహరించినట్లు మోడీ కేబినెట్ లోని మంత్రులు మాత్రం అగ్నిపథ్ పథకాన్ని అద్భుతం అని అభివర్ణిస్తూ, వ్యతిరేక ఆందోళనల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయనీ, ఆర్మీ బలోపేతం కావడం ఇష్టం లేని శక్తులే వెనుకుండి ఈ ఆందోళనలను రెచ్చగొడుతున్నాయనీ విమర్శలు మొదలెట్టేశారు. ఈ రెండు విషయాలలోనే కాదు.. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మోడీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా వారిపై దేశ వ్యతిరేకులు, ప్రగతి నిరోథకులు అన్న ముద్ర వేయడం మోడీ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా  మారిపోయింది.  సమస్యను పక్కతోవ పట్టించేందుకు దేశ భక్తి అంశాన్ని ఉపయోగించుకునే మోడీ తీరు మారాలి. సమస్యలపై, ప్రజాందోళనలపై అన్ని పక్షాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించాలి.

By
en-us Political News

  
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మే 29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-7
ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది.
వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది. 
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
 బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా బెయిల్ విషయంలో ఇంకా  క్లారిటీ రాలేదు.   ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు.
బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ఎవర్నయినా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారా? ఎవరూ నోరు ఎత్తకుండా ఆందోళనకారులందర్నీ బూటు కాళ్ళ కింద వేసి తొక్కేశారే... అప్పుడేమయ్యాయి ఈ నీతి సూత్రాలు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏమైనా అభినవ గజనీయా? గతంలో ఆయన చేసినవేవీ ఆయనకు ఇప్పుడు గుర్తుకు లేవా? లేక తన కన్వీనియెన్స్ కోసం మరిచిపోయినట్లు నటిస్తున్నారా? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయహే తెలంగాణకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించే విషయమై బీఆర్ఎస్ గగ్గోలు పెట్టేస్తోంది.
ఉత్తరాదిలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వున్నా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తొమ్మిది స్థానాలు గెల‌వ‌బోతోంది. ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడానికి వ్యూహాత్మ‌కంగా ఎత్తుగ‌డ‌లు వేసింది.
వైసీపీ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం (మే28) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీలో వున్న ప్రతి అడ్డమైన వాడికీ ఒక దిక్కుమాలిన ముహూర్తం దొరికింది. ప్రతివాడూ ఆ ముహూర్తానికి జగన్ ప్రమాణ స్వీకారం వుంటుందని చెబుతూ నోటి తుత్తర తీర్చుకుంటున్నారు. ఆ బ్యాచ్‌లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా చేరాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.