వెంకయ్యను గిల్లి మోడీ జోల పాట

Publish Date:Aug 12, 2022

Advertisement

పిల్లాడిని గిల్లేసి.. ఆనక తీరిగ్గా జోలపాట పాడిందట వెనుకటికి ఓ మహాతల్లి.  తాజా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరు సరిగ్గా ఇలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లేదా.. ఉప రాష్ట్రపతిగా రెండోసారి కొనసాగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకయ్య నాయుడికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టేసిన మోడీ తీరిగ్గా ఆయనకు మూడు పేజీల ఫేర్ వెల్ లేఖ రాసిన తీరును విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు దేశానికి చేసిన సేవలను ప్రధాని మోడీ తన ఫేర్ వెల్ లేఖలో కొనియాడడం గమ్మత్తుగా ఉందంటున్నారు. పొగడడం, అంతటితో ఆగకుండా మోడీ భూదానోద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య వినోబా భావేతో వెంకయ్య నాయుడిని పోల్చిన వైనాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఏ విషయమైనా సూటిగా, సుస్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వినోబా భావేకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని, అలాంటి లక్షణమే వెంకయ్య నాయుడిలోనూ ఉందని మోడీ పొగడ్తలతో ముంచెత్తారు.

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉప రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడి ప్రయాణం ఎంతో స్ఫూర్తిమంతం అంటూ మోడీ ప్రశంసించారు. అయితే.. అన్ని దశలూ దాటుకుని అంతటి ఘన కీర్తి పొందిన వెంకయ్యపై ఏ మాత్రం గౌరవం లేకుండా బలవంతపు విశ్రాంతికి పంపడం ఏమిటని పలువురు మొడీని సూటిగా ప్రశ్నిస్తున్నారు.  ఏపీలో అసలే ప్రాధాన్యం లేని బీజేపీ, రాజకీయ ఉద్యమంలో చేరడానికి వెంకయ్యను ప్రేరేపించిన నమ్మకం, నిబద్ధత ఎంత శక్తిమంతమైనవో ఊహించుకోవచ్చనేది మోడీ వక్తం చేసిన అభిప్రాయం.

వెంకయ్య నాయుడి శక్తి అనంత ప్రవాహం లాంటిదనీ. దాన్ని వెంకయ్య నాయుడి చతురత, జ్ఞానంలో చూడొచ్చనీ. వెంకయ్య వేసే అంత్య ప్రాసలు బాగా ప్రాచుర్యం పొందాయని మోడీ స్వయంగా ఫేర్ వెల్ లేఖలో ప్రస్తావించారు. వాక్చాతుర్యమే వెంకయ్యకు గొప్ప బలం అన్నారు. వెంకయ్య నాయుడి మాటలు ఎప్పుడు విన్నా.. అత్యంత అనువైన పదాలతో విషయాన్ని స్పష్టంగా చెప్పిన వినోబా భావే తనకు గుర్తుకు వస్తారంటూ కితాబు ఇచ్చారు. వినేవారిని సమ్మెహితులను చేసి, విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే వెంకయ్య నాయుడి సామర్ధ్యం అద్భుతం అని మోడీ కీర్తించారు. అక్కడితో సరిపెట్టని మోడీ ‘వెంకయ్య నాయుడి చతురతకు జీవితకాలం ఆరాధకుడిగా ఉంటాను’ అని ఆ ఫేర్ వెల్ లేఖలో పేర్కొన్నారు. వెంకయ్య వ్యక్తిగత సలహాలతో తాను వ్యక్తిగతంగా ఎంతో లబ్ధి పొందాననీ చెప్పారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడికి సరైన ప్రాధాన్యం కల్పించేందుకు మాత్రం మోడీకి చేతులు, నోరు రాలేదేమని తెలుగు ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వెంకయ్య నాయుడి లోతైన ఆలోచనలు, చేసిన విశ్లేషణలను వినేందుకు జర్నలిస్టులు, మేధావులు కూడా ఎంతో ఆసక్తి, ఉత్సుకత చూపించేవారని మోడీ గుర్తుచేశారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పనిచేసిన విధానాన్ని బట్టి ఆయన శక్తి సామర్ధ్యాలను అంచనా వేయొచ్చనీ, రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు రాజ్యసభను నిర్వహించిన తీరు అద్భుతం అన్నారు.

ప్రధాని మోడీ. అధికార, ప్రతిపక్ష సభ్యులతో వెంకయ్య నెరపిన సన్నిహిత సంబంధాలు సభలో సౌహార్ద్ర స్ఫూర్తిని నింపాయంటున్నారు. అలాంటి వెంకయ్య నాయుడికి ఉన్నత పదవిలో నిలబెడితే జాతి మరింత స్ఫూర్తి పొందుతుందని, ముందుకు వెళ్తుందని మీరు ఎందుకు భావించలేదని మోడీని జనం ప్రశ్నిస్తున్నారు. పేదరిక నిర్మూలన, సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత చూపించిన వెంకయ్య నాయుడు ప్రతి విషయాన్నీ ‘నేషన్ ఫస్ట్’ కోణంలో చూసేవారని మోడీ చెప్పుకొచ్చారు. అలా నేషన్ ఫస్ట్ భావనతో ఉండే వెంకయ్య నాయుడు దేశ ప్రథమ పౌరుడిగా పనికిరాలేకపోయారా? మోడీ గారూ అంటూ పలువురు నిలదీస్తున్నారు. వెంకయ్య నాయుడి అనుభవం, జ్ఞానం భవిష్యత్ లో శాసనకర్తలకు వెలలేని ఆస్తులుగా ఉపయోగపడతాయంటున్న మోడీ.. మరి ఆయనను రాష్ట్రపతిని చేయడానికి ఇంకేమి లోపం కనిపించిందో వెల్లడిస్తే బాగుంటుందంటున్నారు.

By
en-us Political News

  
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.