రాఫెల్ డీల్.. కేంద్రం సుప్రీంకోర్టుకి అబద్ధాలు చెప్పింది!!

Publish Date:Dec 15, 2018

Advertisement

 

రాఫెల్ డీల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు సంబరపడిపోతూ.. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ సంబరాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాఫెల్ డీల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మీద మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.

'రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కాగ్ ద్వారా.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి అందజేశాం. వాళ్లకు పూర్తి అగాహన ఉంది' అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులో ఇది స్పష్టంగా ఉంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాగ్ రాఫెల్‌పై నివేదిక ఎప్పుడు ఇచ్చింది?.. పీఎసీ ముందుకు ఎప్పుడు వచ్చింది? అనే సందేహాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పీఏసీ చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. మరి ఆయనకు తెలియకుండా కేంద్రం చెప్పిన కాగ్ రిపోర్ట్ పీఏసీ ముందుకు రాదు కదా?. మరి కేంద్రం సుప్రీంకోర్టుకు ఎందుకు అబద్దాలు చెప్పింది? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారమపై పీఏసీ చైర్మన్, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే తాజాగా స్పందించారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. పార్లమెంటులో కాగ్‌ ఇచ్చిన నివేదికను ఎప్పుడు ప్రవేశపెట్టారనే దానిపై అటార్నీ జనరల్‌, కాగ్‌ సమాధానం ఇవ్వాలి. ఈ మేరకు పీఏసీ సభ్యులతో మాట్లాడి వారికి సమన్లు పంపిస్తాం అని ఖర్గే తెలిపారు. కాగ్‌ ఇచ్చిన నివేదికను పీఏసీ ఎప్పుడు పరిశీలించింది?. ఆ నివేదికను పార్లమెంటు ఎదుట ఎప్పుడు ఉంచారు? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం అన్నారు. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. చూస్తుంటే రాఫెల్ రచ్చ ఇప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని వదిలేలా లేదుగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డం వంటి ప‌నుల‌కే జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు.
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న వ‌ర్గీయుల అరాచ‌కం పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. వారి క్రియేటివిటీని చూసి ఏపీ ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇదేంట్రా బాబు.. మ‌నం ఏమైనా పిచ్చోళ్ల‌మా అని చ‌ర్చించుకుంటున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి.
రాజకీయాలను తాను వదిలేసినా రాజకీయాలు తనను వదల లేదంటూ చిరంజీవి ఏదో సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది. అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు. 25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి. గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.
నమస్తే జలగన్నా. అలియాస్ జగనన్నా. నాపేరు జలగశ్రీ. నువ్వేమో సింబాలిక్ జలగవి.. నేనేమో రియల్ జలగని! నేను ఈమధ్యే పుట్టాను.
పౌరుషానికి మారు పేరు పల్నాడు. అయితే జగన్ ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధాల  దోచుకుంటున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుంబిగించారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, అంతకు మించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు.
జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు.
వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.