కేసీఆర్ ముందస్తు వ్యూహాలకు మోడీ ముకుతాడు!

Publish Date:Jul 4, 2022

Advertisement

రాజకీయ దురంధరుడిగా, ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలతో దూసుకుపోయే నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి గుర్తింపు ఉంది. నిత్యం రాజకీయ జిత్తులు, రణతంత్రపు ఎత్తులతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉండే కేసీఆర్ కు ఇటీవలి కాలంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వ్యూహాలు వికటిస్తున్నాయి.

ఎత్తులు పారడం లేదు. తాడనుకున్నది కూడా పామై బుస కొడుతోంది. ఏ ముహూర్తంలో అయితే జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించారో అప్పటి నుంచీ ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాను ఒకటి తలిస్తే మరొటి జరుగుతోంది.  ఆయన ముందస్తు వ్యూహాలకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తున్నది. తెరాసకు మొదటి నుంచీ కూడా ముందస్తు ఎన్నికలు కలిసి వచ్చాయి. ఇప్పటి వరకూ కలిసి వస్తూనే ఉన్నాయి. 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పూర్తిగా ఐదేళ్లూ అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండో సారి అధికార పగ్గాలను అందుకున్నారు. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

2023 వరకూ అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ఆరు నెలలు ముందుగానే ముందస్తుకు వెళ్లి రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఆయన అనుకున్న విధంగా చేయాలంటే  సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో అసెంబ్లీని రద్దు చేయాలి. అలా జరిగితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.   కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు అచ్చొచ్చాయన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన గురించి బాగా తెలిసిన వారు కేసీఆర్ ముందస్తు యోచనలోనే ఉన్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పేస్తారు. ఇప్పుడు ఆయన అడుగులు కూడా ముందస్తు వైపే ఉన్నాయని పరిశీలకులు సైతం అంటున్నారు. అయితే ఆయన ముందస్తు వ్యూహాలకు కేంద్రం ముకు తాడు వేసే  యోచనలో ఉంది. కేసీఆర్ కనుక ముందస్తు ఎన్నికలకు వెళితే.. కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పటికే కేంద్రం ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చింది. అదెలాగంటే..గత ఎనిమిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ,  తెలంగాణ రాష్ట్రాలు   అసెంబ్లీ సీట్లను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ  నియోజకవర్గాల సంఖ్యను 153 పెంచే ప్రక్రియను కేంద్రం ఆరంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల సంఖ్య పెంపునకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది.

రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా  నివేదిక అందితే.. వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ  విషయంపై తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత వరకూ స్పందన లేదు. అది వేరే సంగతి.. కానీ   తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభనజపై గత ఏడాది ఆగస్టులో లోక్ సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం 2031 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని సమాధానమిచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకర్గాల పునర్విభజనపై వస్తున్న సమాచారంలో నిజమెంత అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

ఇక్కడే కేంద్రం తన వ్యూహ చతురతను ప్రదర్శించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వేళ ముందస్తు ఎన్నికలకే సై అంటూ అసెంబ్లీని రద్దు చేస్తే.. అప్పుడు కేంద్రం తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తుంది. ఆఘమేఘాల మీద ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదం పొందుతుంది. అప్పుడు నిర్ణీత గడువు కంటే ఆరు నెలల ముందే తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ఎందుకంటే అప్పటికే కేసీఆర్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కనుక.    ఇప్పటికే కేంద్రం ఆ దిశగా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారా? ఆ ధైర్యం చేస్తారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
 

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.