ఇది రాష్ట్ర క‌మిటీ కాదు...కిష‌న్ రెడ్డి క‌మిటీ!

Publish Date:Sep 10, 2025

Advertisement

 

బీజేపీలో క‌మిటీల క‌ల‌హం మొద‌లైంది. రాష్ట్రానికి కొత్త అధ‌క్షుడొచ్చాడ‌న్న కొత్త ఆశే లేకుండా పోయింది. పాత కొత్త‌ల మేలు క‌ల‌యిక‌గా ఉండాల్సిన పార్టీ జ‌ట్టు కూర్పు కాస్తా ఏక‌ప‌క్షం అయిపోయింది. ఒక ద‌శ‌లో మాజీ బీజేపీ నేత‌, ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఇది స్టేట్ క‌మిటీనా? సికింద్రాబాద్ క‌మిటీనా? అంటూ తేల్చేశారు. ఆయ‌న అన్న‌ట్టుగానే స్టేట్ బీజేపీలో సికింద్రాబాద్ నుంచి ఏకంగా 11 మందిని తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ఈ కామెంట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. త‌మ‌కు త‌గిన ప్రాధాన్య‌త‌నివ్వ‌క పోవ‌డంతో.. రాజాసింగ్ లాంటి చాలా మంది ఆయ‌న బాట‌లో న‌డిచే అవ‌కాశ‌ముంద‌న్న మాట వినిపిస్తోంది.

అయితే ఇదేమీ త‌న మార్క్ టీమ్ కాదంటారు రామ‌చంద్ర‌రావు. ఇది బీజేపీ మార్క్ టీం. ఈ టీమ్ తోనే తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని ఘంటా ప‌దంగా చెప్పారాయ‌న‌. అంతే కాదు.. ఇలాంటి అసంతృప్తులూ ఉంటూనే ఉంటాయి. ఇందులో ఆశ్చ‌ర్య పోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. రాజాసింగ్ లాంటి వారు విమ‌ర్శిస్తూనే ఉంటార‌ని కామెంట్ చేశారు టీబీజేపీ చీఫ్ రామ‌చంద్ర‌రావు.

ముగ్గురు ఎంపీలున్న ఉత్త‌ర తెలంగాణ జిల్లాలైన క‌రీంన‌గ‌ర్, మెద‌క్, ఆదిలాబాద్ నుంచి క‌నీసం ఒక్క‌రు కూడా క‌మిటీలో లేక పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం ప‌రిధిలోని నేత‌ల‌కు క‌నీస ప్రాతినిథ్యం లేకుండా  పోయింద‌ని వాపోతున్నారీ ప్రాంత వాసులు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. వీరు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతాల్లో గ‌త ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డ్డ ఎంద‌రో లీడ‌ర్ల పేర్లు క‌మిటీలో పెట్టాల‌న్న ప‌ప్ర‌తిపాద‌న‌లు అందాయి. బండి సంజ‌య్, ధ‌ర్మ‌పురి అర‌వింద్ వంటి వారు నేరుగా రామ‌చంద్ర‌రావు ముంద‌టే చెప్పారు. మా వాళ్ల‌కు త‌గిన చోటు క‌ల్పించాల్సిందేన‌ని.. కానీ, ఎలాంటి క‌నిక‌రం చూపిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఇదే ర‌క‌మైన సిఫార్సులు చేశారు. వీరెవ‌రి ప్ర‌తిపాద‌న‌లు కూడా ప‌ట్టించుకోలేదు. అన్నీ బుట్ట‌దాఖ‌ల‌యిన‌ట్టు తెలుస్తోంది.

క‌మిటీ మొత్తం మాజీ స్టేట్ ప్రెసిడెంట్ కిష‌న్ రెడ్డి, ఆపై రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ భ‌న్స‌ల్ స‌న్నిహితుల‌తో నిండిపోయినట్టు క‌నిపిస్తోంది. వీరితో పాటు రాష్ట్ర సంఘ‌ట‌న్ కార్య‌ద‌ర్శిగా ప‌ని  చేసిన ఒక నేత‌తో పాటు.. పార్టీ ఆర్ధిక వ్య‌వ‌హారాలు చూసిన ఒక ఒక ప్రొఫెస‌ర్ సూచ‌న‌లు సైతం కీల‌కంగా ప‌ని చేసిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో రాష్ట్ర అధ్య‌క్షుడిగా  ప‌ని చేసిన బండి సంజ‌య్ మాట‌ను క‌నీసం ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్.

ఎంపీలు డీకే అరుణ‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల‌, కొండా, గోడం న‌గేశ్ వంటి వారి స‌ల‌హా సూచ‌న‌లేవీ ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. వీరంతా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి పార్టీ అధిష్టానం నుంచి వ‌చ్చిన ఒక నేత‌కు ఫుట్ బాల్ బ‌హుమ‌తిగా ఇచ్చి త‌న నిర‌స‌న వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి. 

ఇదిలా ఉంటే ఒక ప‌క్క కాంగ్రెస్ బీసీ బిల్లు అంటూ నానా హంగామా చేస్తోంటే.. ఎప్ప‌టిలాగానే బీసీల‌కు బొత్తిగా మొండి చేయి చూపించింది బీజేపీ రాష్ట్ర క‌మిటీ. బేసిగ్గా క‌మిటీలో 40 శాతం పాత వారికి చోటివ్వాల్సి ఉంది. కానీప్ర‌స్తుత జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నికైన ముగ్గురూ కొత్త‌వారే. బండి వ‌ర్గీయులుగా పేరుబ‌డ్డ గీతామూర్తి, మ‌నోహ‌ర్ రెడ్డి, రామ‌కృష్ణారెడ్డి, ఆంజ‌నేయులు, రాణీరుద్ర‌మ‌కు క‌మిటీలో చోటు ద‌క్క‌లేదు. మ‌రోప‌క్క అర‌వింద్, ఈట‌ల సూచించిన పేర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

11 ఓసీలుంటే ఇందులో న‌లుగురు బ్రాహ్మ‌ణులు, న‌లుగురు రెడ్లకు అవ‌కాశం ఇచ్చారు. బీసీవాదుల‌మ‌ని చెప్పుకుంటూనే క‌నీసం స‌గం మందికి కూడా క‌మిటీలో ప్ర‌యారిటీ ఇవ్వలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీంతో ఈ  ప‌రిణామాలు ఎలా దారి తీస్తాయో తెలీడం లేద‌ని అంటున్నారు. అందుకే రాజాసింగ్ దీన్ని సికింద్ర‌బాద్ ఎంపీ కిష‌న్ రెడ్డి క‌మిటీగా  కామెంట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

కిష‌న్ రెడ్డి మాట ఇంకా చెల్లుబాటు కావ‌డం అంటే అది తిరిగి పాత బీజేపీగానే వెన‌క‌బ‌డి ఉంటుంది త‌ప్ప కొత్తద‌నం అంటూ ఏమీ ఉండ‌దు.. ముందుకెళ్ల‌డం అంత‌క‌న్నా జ‌ర‌గ‌ద‌న్న కామెంట్ వినిపిస్తోంది. రాజాసింగ్ మాట‌ల‌ను అనుస‌రించి చెబితే ఆయ‌న‌కు అధికారంలోకి పార్టీ రావ‌డం క‌న్నా.. ఎవ‌రు అధికారంలో  ఉంటారో వారి ద్వారా ప‌నులు చ‌క్క‌బెట్ట‌డం బాగా తెలుసు కాబ‌ట్టి.. ఇది ముందుకెళ్లే క‌మిటీ కాదు.. వెన‌కెన‌క దాగి సొంత ప‌నులు  చేయించుకునే క‌మిటీగా కొంద‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.