ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. ముందుగా చెప్పినట్లే సోమవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని కలిసిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అంద జేశారు. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారి కంగా ప్రకటించింది. అనంతరం గవర్నర్ తమిళిసై ను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపా యింట్ మెంట్ కోరారు. కాగా రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరడానికి ముహూర్తం కూడా ఫిక్సై పోయిందని తెలుస్తున్నది. ఈ నెలాఖరులో ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారు.
2018 డిసెంబర్లో మునుగోడు ఎమ్మెల్యే గా రాగోపాల్ రెడ్డి గెలిచారు. కాగా కేసీఆర్ పాలనలో తెలంగాణా అన్యాయమైపోయిందని, తెలంగాణా తల్లిని కాపాడుకోవడానికే తాను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చానని రాజ్గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణాలో కుటుంబ పాలనతో రాష్ట్రాభివృద్ధి కుంటుబడిందని, దీన్ని ఎదుర్కొని పాలక పక్షాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి లేదని రాజ గోపాల్ అన్నా రు. ఆయన రాజీనామా చేయడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ మునగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.
పార్టీ సభ్యత్వానికీ, మునుగోడు ఎమ్మెల్యే పదవికీ ఆయన రాజీనామా చేశారు. ఆయన్ను పార్టీ నుంచి తొల గించాలా వద్దా అన్న అంశం మీద ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో పార్టీ నాయకుల సమావేశానంతరం కోమటిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే బీజేపీలో ఎప్పుడు చేరుతున్నారన్నది అప్పు డు చెప్పనప్పటికీ రాజీనామా అనంతరం ఆయనీ విషయంలో స్పష్టత ఇచ్చారు. అమిత్ షా సమక్షంలో ఆయన ఈ నెల చివరి వారంలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు, బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లోకి మారుతుండడం విషయం లోనూ పార్టీ నాయకులు వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పట్ల కూడా ఆయన ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పార్టీ హైకమాండ్ను గతంలో విమర్శించినవారికే పార్టీలో కీలక పదవులు కట్టిపెట్టడం పట్ల కూడా రాజ గోపాల్ అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడి యాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తప్ప ఇంకే కనిపించడం లేదని మండిపడ్డారు. టీ ఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమ ర్శించారు. ఉప ఎన్నిక వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందన్నారు. యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తా రని తెలిపారు. టీపీసీసీ చీప్ భాష విని సమాజం తలదించుకుందని, జైలుకెళ్లిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-krajagopalreddi-resigned--25-141480.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.