మిస్ వ‌ర‌ల్డ్‌లో రాజ‌కీయ కుట్ర కోణం?

Publish Date:May 25, 2025

Advertisement

 

మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్య‌వ‌హార శైలి కాస్త అనుమానాస్ప‌దంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మ‌ర్ అయిన మ్యాగీ త‌న త‌ల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విష‌యాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వ‌స్తోంద‌ని అంటారు కొంద‌రు.మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు అన‌గా ఇప్ప‌టికిప్పుడొచ్చిన న‌ష్టం ఏమీ లేదు. ఎందుకంటే 1951లో ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇంగ్లండ్ లో ఒక బికినీ షోతో మొద‌లైన ఈ పోటీలు.. ఆనాడే వివాదాస్ప‌దం. ఆ త‌ర్వాత అదిప్ప‌టికి అర‌డ‌జ‌ను సార్ల‌కు పైగా ర‌క‌ర‌కాల వివాదాల‌తో తీవ్ర అభ్యంత‌రాల‌ను ఎదుర్కుంది. తెలుపు- న‌లుపు, మ‌తానికి సంబంధించి, ఆపై కోవిడ్ వంటి విష‌యాల్లో ఈ పోటీలు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆ మాట‌కొస్తే హైద‌రాబాద్ లోనూ వ్య‌తిరేక‌త‌లు ఎదుర‌య్యాయి. కొన్ని ప్ర‌జా సంఘాల వారు ఈ పోటీల‌ను తొలి  నుంచీ వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. 

ఇప్పుడు కూడా ఇక్క‌డ కూడా వ్య‌తిరేకించారు. అయితే ఇక్క‌డ మ్యాగీ విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలేంటంటే.. ఇది ఒక ఇంగ్లండ్ కి సంబంధించిన పీజెంట్. ఆమె మ‌రెవ‌రో కాదు మిస్ ఇంగ్లండ్. అలాంటిది త‌న దేశానికి సంబంధించిన ఒక పోటీలో పాల్గొని.. ఎలాగోలా ఇక్క‌డి స్థితిగ‌తుల‌ను అవ‌గ‌తం చేసుకుని వాటిని పూర్తి చేసి.. ముందుకెళ్లి కిరీటం ద‌క్కించుకోవాలి. ఆమెకంటూ ఈ కిరీటం ద‌క్క‌ద‌నుకుందో ఏమో తెలీదు. కానీ ఆమె అయితే అర్ధాంత‌రంగా అది కూడా ఒక అబ‌ద్ధం చెప్పి త‌ప్పుకుంది. త‌న త‌ల్లికి బాగోలేద‌ని ఆమె చెప్ప‌డం విడ్డూరం. ఇది ఎప్ప‌టికీ స్ఫూర్తి కాదు. రెండో విష‌యం ఇక్క‌డంద‌రూ త‌న‌నొక వేశ్య‌ను చూసిన‌ట్టు చూస్తున్నారంటే.. అర్ధ‌మేంటి? ఇక్క‌డో మాట అక్క‌డో మాట చెప్ప‌డంలో మీనింగ్ ఏమ‌నుకోవాలి?అంటే మిగిలిన కంటెస్టెంట్లంతా వేశ్య‌ల‌నా? లేక హైద‌రాబాద్ అంటే అతి పెద్ద విటుల సంఘ‌మ‌నా ఒక ర‌కంగా చెబితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యానాల వ‌ల్ల ఆమె ఒక్క‌రే శుద్ధ  పూస మిగిలిన వారాంతా వ్య‌భిచారుల‌ని. 

అంతేగా దీన‌ర్ధం! మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ఇటు వ‌చ్చింది సాదా సీదా టూరిస్టుగా కాదు. ఒక దేశానికి ప్ర‌తినిథిగా. పైపెచ్చు ఇదామె దేశానికి సంబంధించిన ప్ర‌పంచంలోనే నాలుగో అతి  పెద్ద బ్యూటీ ఈవెంట్. దాన్ని అప‌హాస్యం చేయ‌డం అంటే త‌న దేశాన్ని సైతం అప‌హాస్యం చేయ‌డంతో స‌మానం. 
మ‌రో ఇంపార్టెంట్ థింగ్.. ఇది బ్యూటీ విత్ ప‌ర్ప‌స్ గా 1980ల కాలం నాటి నుంచి ప్రాచుర్యం పొందింది. ఈ మొత్తం ఈవెంట్ ద్వారా సంపాదించిన మొత్తంలోంచి 1 బిలియ‌న్ పౌండ్ల‌ను విక‌లాంగులు, అనాథ బాలల‌కు ఒక చారిటీగా ఇస్తారు. దీన్ని కూడా ఆమె క‌నీసం గుర్తించ‌లేదు.ఇక పోతే హైద‌రాబాద్ కి లండ‌న్ కొ ఒక పోలిక ఏంటంటే.. హైద‌రాబాద్ లోనూ లండ‌న్లోనూ న‌దులుంటాయి. లండ‌న్ న‌గ‌ర మ‌ధ్య భాగంలో థేమ్స్ న‌ది ఉన్న‌ట్టు.. ఇక్క‌డ కూడా మూసీ న‌ది ఉంటుంది. ఈ ప్ర‌భుత్వం మూసీ ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించింది. తాను వ‌చ్చేట‌పుడు ఈ విష‌యం కూడా తెలుసుకుని.. తాను ఈ దిశ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా విరాళాలు సేక‌రించి త‌న వంతు బాధ్య‌త తీసుకోవ‌చ్చు.

 అదీ  మిస్ చేసిందీ మిస్ ఇంగ్లండ్. ఇక పోతే.. వ‌చ్చే రోజుల్లో ఈమె అందానికి దాని వెన‌క ఉన్న తెలివికి మెచ్చి పొర‌బాటున ఐక్య‌రాజ్య స‌మితి ఈమెకు ఏ సోమాలియాకో పంపి అక్క‌డి మ‌హిళ‌ల‌ల్లో సంస్క‌ర‌ణ తీసుకురావాల‌ని.. వారికంటూ ఆత్మ విశ్వాసాన్ని నూరిపోయాల‌న్న బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తూ ఒక అంత‌ర్జాతీయ రాయిబారిగా పంపితే అక్క‌డ వారు ఇలా చేశారు అలా చేశారు. అక్క‌డి అర‌టిపండ్లు, ఒంటె పాలు నేను తాగ‌లేక పోయానంటే ఎలా ఉంటుంది?ఇదిలా ఉంచండి. బేసిగ్గా మ్యాగీ ఒక స్విమ్మ‌ర్. స్విమ్మింగ్ ఏం చెబుతుంది? ఎన్నేసి అవాంత‌రాలు ఎదురైనా వాటిని ఈదుకుంటూ వెళ్లాల‌ని. క‌నీసం ఆ స్పిరిట్ కూడా ఆమె కొన‌సాగించ‌లేక పోయారు. ఫైన‌ల్ గా ఇక్క‌డ మ్యాగీ వ్య‌వ‌హార‌శైలి అనుమానాస్ప‌దంగా  ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక్క‌డున్న కొన్ని ప్ర‌త్య‌ర్ధి పార్టీ ఎన్నారై లింకులు అక్క‌డ మ్యాగీ మ‌ద‌ర్ ని మేనేజ్ చేసి ఉంటారేమో.. అని అంటున్నారు కొంద‌రు. 

అంతే కాదు ఇక్క‌డ ఒక రాజ‌కీయ పార్టీ క‌ర‌ప‌త్రిక‌ ఈ విష‌యంపై ఎంతో ఆతృత క‌న‌బ‌ర‌చి.. త‌ద్వారా ఆమెకు ఫోన్ చేసి మ‌రీ ఈ విష‌యం ఒక క్లారిటీ తెచ్చుకుని.. అక్క‌డున్న త‌మ యూకే ప్ర‌తినిథి  చేత ఇది బ్రాండ్ హైద‌రాబాద్ ఇమేజీకే డ్యామేజీ క‌లిగించే అంశ‌మంటూ స్టేట్మెంట్ ఇప్పించారంటే.. దీని వెనక ఏ రాజ‌కీయ కుట్ర కోణం లేద‌నుకోవాలా? అంటున్నార‌ట కొంద‌రు. మ‌రి చూడాలి.. ఇలాంటి కుట్ర కోణాలు ఇందులో మ‌రేవైనా దాగి ఉన్నాయో తెలియాల్సి ఉందంటున్నారు వీరు.  ఏది ఏమైనా మ్యాగీ చాలా పెద్ద త‌ప్పు చేశారు. ఇటు త‌న ఇంగ్లండ్ సంస్థ మిస్ వ‌ర‌ల్డ్ ఆర్గ‌నైజేష‌న్ కి, అటు హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజీకి మాయ‌ని మ‌చ్చ తెచ్చారు. అంతే కాదు త‌న‌తో పాటు పాల్గొన్న ఇత‌ర కంటెస్టెంట్ల‌ను కూడా ఆమె ఒక ర‌కంగా వేశ్య‌ల‌ని ఇండెరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది త‌ప్ప కుండా కోటిన్న‌రకు పైగా జ‌నాభాగ‌ల స‌గ‌టు హైద‌రాబాద్ వాసి ఖండించాల్సి ఉందని అంటారు కొంద‌రు సామాజిక వేత్త‌లు. మ‌రి మీరేమంటారు?


 

By
en-us Political News

  
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.