మిస్ వ‌ర‌ల్డ్‌లో రాజ‌కీయ కుట్ర కోణం?

Publish Date:May 25, 2025

Advertisement

 

మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్య‌వ‌హార శైలి కాస్త అనుమానాస్ప‌దంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మ‌ర్ అయిన మ్యాగీ త‌న త‌ల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విష‌యాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వ‌స్తోంద‌ని అంటారు కొంద‌రు.మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు అన‌గా ఇప్ప‌టికిప్పుడొచ్చిన న‌ష్టం ఏమీ లేదు. ఎందుకంటే 1951లో ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇంగ్లండ్ లో ఒక బికినీ షోతో మొద‌లైన ఈ పోటీలు.. ఆనాడే వివాదాస్ప‌దం. ఆ త‌ర్వాత అదిప్ప‌టికి అర‌డ‌జ‌ను సార్ల‌కు పైగా ర‌క‌ర‌కాల వివాదాల‌తో తీవ్ర అభ్యంత‌రాల‌ను ఎదుర్కుంది. తెలుపు- న‌లుపు, మ‌తానికి సంబంధించి, ఆపై కోవిడ్ వంటి విష‌యాల్లో ఈ పోటీలు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆ మాట‌కొస్తే హైద‌రాబాద్ లోనూ వ్య‌తిరేక‌త‌లు ఎదుర‌య్యాయి. కొన్ని ప్ర‌జా సంఘాల వారు ఈ పోటీల‌ను తొలి  నుంచీ వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. 

ఇప్పుడు కూడా ఇక్క‌డ కూడా వ్య‌తిరేకించారు. అయితే ఇక్క‌డ మ్యాగీ విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలేంటంటే.. ఇది ఒక ఇంగ్లండ్ కి సంబంధించిన పీజెంట్. ఆమె మ‌రెవ‌రో కాదు మిస్ ఇంగ్లండ్. అలాంటిది త‌న దేశానికి సంబంధించిన ఒక పోటీలో పాల్గొని.. ఎలాగోలా ఇక్క‌డి స్థితిగ‌తుల‌ను అవ‌గ‌తం చేసుకుని వాటిని పూర్తి చేసి.. ముందుకెళ్లి కిరీటం ద‌క్కించుకోవాలి. ఆమెకంటూ ఈ కిరీటం ద‌క్క‌ద‌నుకుందో ఏమో తెలీదు. కానీ ఆమె అయితే అర్ధాంత‌రంగా అది కూడా ఒక అబ‌ద్ధం చెప్పి త‌ప్పుకుంది. త‌న త‌ల్లికి బాగోలేద‌ని ఆమె చెప్ప‌డం విడ్డూరం. ఇది ఎప్ప‌టికీ స్ఫూర్తి కాదు. రెండో విష‌యం ఇక్క‌డంద‌రూ త‌న‌నొక వేశ్య‌ను చూసిన‌ట్టు చూస్తున్నారంటే.. అర్ధ‌మేంటి? ఇక్క‌డో మాట అక్క‌డో మాట చెప్ప‌డంలో మీనింగ్ ఏమ‌నుకోవాలి?అంటే మిగిలిన కంటెస్టెంట్లంతా వేశ్య‌ల‌నా? లేక హైద‌రాబాద్ అంటే అతి పెద్ద విటుల సంఘ‌మ‌నా ఒక ర‌కంగా చెబితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యానాల వ‌ల్ల ఆమె ఒక్క‌రే శుద్ధ  పూస మిగిలిన వారాంతా వ్య‌భిచారుల‌ని. 

అంతేగా దీన‌ర్ధం! మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ఇటు వ‌చ్చింది సాదా సీదా టూరిస్టుగా కాదు. ఒక దేశానికి ప్ర‌తినిథిగా. పైపెచ్చు ఇదామె దేశానికి సంబంధించిన ప్ర‌పంచంలోనే నాలుగో అతి  పెద్ద బ్యూటీ ఈవెంట్. దాన్ని అప‌హాస్యం చేయ‌డం అంటే త‌న దేశాన్ని సైతం అప‌హాస్యం చేయ‌డంతో స‌మానం. 
మ‌రో ఇంపార్టెంట్ థింగ్.. ఇది బ్యూటీ విత్ ప‌ర్ప‌స్ గా 1980ల కాలం నాటి నుంచి ప్రాచుర్యం పొందింది. ఈ మొత్తం ఈవెంట్ ద్వారా సంపాదించిన మొత్తంలోంచి 1 బిలియ‌న్ పౌండ్ల‌ను విక‌లాంగులు, అనాథ బాలల‌కు ఒక చారిటీగా ఇస్తారు. దీన్ని కూడా ఆమె క‌నీసం గుర్తించ‌లేదు.ఇక పోతే హైద‌రాబాద్ కి లండ‌న్ కొ ఒక పోలిక ఏంటంటే.. హైద‌రాబాద్ లోనూ లండ‌న్లోనూ న‌దులుంటాయి. లండ‌న్ న‌గ‌ర మ‌ధ్య భాగంలో థేమ్స్ న‌ది ఉన్న‌ట్టు.. ఇక్క‌డ కూడా మూసీ న‌ది ఉంటుంది. ఈ ప్ర‌భుత్వం మూసీ ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించింది. తాను వ‌చ్చేట‌పుడు ఈ విష‌యం కూడా తెలుసుకుని.. తాను ఈ దిశ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా విరాళాలు సేక‌రించి త‌న వంతు బాధ్య‌త తీసుకోవ‌చ్చు.

 అదీ  మిస్ చేసిందీ మిస్ ఇంగ్లండ్. ఇక పోతే.. వ‌చ్చే రోజుల్లో ఈమె అందానికి దాని వెన‌క ఉన్న తెలివికి మెచ్చి పొర‌బాటున ఐక్య‌రాజ్య స‌మితి ఈమెకు ఏ సోమాలియాకో పంపి అక్క‌డి మ‌హిళ‌ల‌ల్లో సంస్క‌ర‌ణ తీసుకురావాల‌ని.. వారికంటూ ఆత్మ విశ్వాసాన్ని నూరిపోయాల‌న్న బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తూ ఒక అంత‌ర్జాతీయ రాయిబారిగా పంపితే అక్క‌డ వారు ఇలా చేశారు అలా చేశారు. అక్క‌డి అర‌టిపండ్లు, ఒంటె పాలు నేను తాగ‌లేక పోయానంటే ఎలా ఉంటుంది?ఇదిలా ఉంచండి. బేసిగ్గా మ్యాగీ ఒక స్విమ్మ‌ర్. స్విమ్మింగ్ ఏం చెబుతుంది? ఎన్నేసి అవాంత‌రాలు ఎదురైనా వాటిని ఈదుకుంటూ వెళ్లాల‌ని. క‌నీసం ఆ స్పిరిట్ కూడా ఆమె కొన‌సాగించ‌లేక పోయారు. ఫైన‌ల్ గా ఇక్క‌డ మ్యాగీ వ్య‌వ‌హార‌శైలి అనుమానాస్ప‌దంగా  ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక్క‌డున్న కొన్ని ప్ర‌త్య‌ర్ధి పార్టీ ఎన్నారై లింకులు అక్క‌డ మ్యాగీ మ‌ద‌ర్ ని మేనేజ్ చేసి ఉంటారేమో.. అని అంటున్నారు కొంద‌రు. 

అంతే కాదు ఇక్క‌డ ఒక రాజ‌కీయ పార్టీ క‌ర‌ప‌త్రిక‌ ఈ విష‌యంపై ఎంతో ఆతృత క‌న‌బ‌ర‌చి.. త‌ద్వారా ఆమెకు ఫోన్ చేసి మ‌రీ ఈ విష‌యం ఒక క్లారిటీ తెచ్చుకుని.. అక్క‌డున్న త‌మ యూకే ప్ర‌తినిథి  చేత ఇది బ్రాండ్ హైద‌రాబాద్ ఇమేజీకే డ్యామేజీ క‌లిగించే అంశ‌మంటూ స్టేట్మెంట్ ఇప్పించారంటే.. దీని వెనక ఏ రాజ‌కీయ కుట్ర కోణం లేద‌నుకోవాలా? అంటున్నార‌ట కొంద‌రు. మ‌రి చూడాలి.. ఇలాంటి కుట్ర కోణాలు ఇందులో మ‌రేవైనా దాగి ఉన్నాయో తెలియాల్సి ఉందంటున్నారు వీరు.  ఏది ఏమైనా మ్యాగీ చాలా పెద్ద త‌ప్పు చేశారు. ఇటు త‌న ఇంగ్లండ్ సంస్థ మిస్ వ‌ర‌ల్డ్ ఆర్గ‌నైజేష‌న్ కి, అటు హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజీకి మాయ‌ని మ‌చ్చ తెచ్చారు. అంతే కాదు త‌న‌తో పాటు పాల్గొన్న ఇత‌ర కంటెస్టెంట్ల‌ను కూడా ఆమె ఒక ర‌కంగా వేశ్య‌ల‌ని ఇండెరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది త‌ప్ప కుండా కోటిన్న‌రకు పైగా జ‌నాభాగ‌ల స‌గ‌టు హైద‌రాబాద్ వాసి ఖండించాల్సి ఉందని అంటారు కొంద‌రు సామాజిక వేత్త‌లు. మ‌రి మీరేమంటారు?


 

By
en-us Political News

  
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.