మావోయిస్టు అగ్రనేత మిసిర్ బేస్రా అరెస్టు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

మావోయిస్టు అగ్రనేత సీపీఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బేస్రా అరెస్టయ్యారు.  గత నాలుగు దశాబ్దాలుగా భద్రతా దళాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మిసిర్ బిస్రా  తలపై 1 కోటి రూపాయల రివార్డు ఉంది.  ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల్లో అనేక విధ్వంస కార్యకలాపాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి   మిసిర్ బేస్రాఅరెస్ట్   దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భద్రతా బలగాల పక్కా వ్యూహంతో సాగించిన  ఆపరేషన్ లో మిసిర్ బేస్రా అరెస్టయ్యారు. 

ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం,   కోబ్రా  బెటాలియన్   సంయుక్తంగా ధన్‌బాద్, గిరిడిహ్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని మంగళవారం (జులై 28)   అర్థరాత్రి సమయంలో చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో మిసిర్ బేస్రా ఉన్నారన్న సమాచారం అంతకు ముందు రోజు అంటే సోమవారం (జులై 27)  రాంచీలో 16 మంది మావోయిస్టులు అధికారుల ఎదుట లొంగిపోయారు.వారిలో మిసిర్ బేస్రాకు  వ్యక్తిగత అంగరక్షకుడు దేవాన్ ముర్ము అలియాస్ శనిచర్వా కూడా ఉన్నాడు. అతడి ద్వారా అందిన  సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.  దీంతో  మిసిర్ బేస్రా, అతనితో ఉన్న మరో ఇద్దరు కీలక రీజినల్ కమిటీ సభ్యులు కూడా చిక్కారు. 

ఝార్ఖండ్ లోని గిరిడిహ్ జిల్లా పిర్తాండ్‌ ప్రాంతానికి చెందిన మిసిర్‌ బేస్రా నాలుగు దశాబ్దాల కిందట  మావోయిస్టు   ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. ఉద్యమంలో భాస్కర్, సునిర్మల్, సాగర్ అనే  వేర్వేరు పేర్లతో కార్యకలాపాలు సాగించారు.  మిసిర్ బేస్రాపై  ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో   పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ  పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా   కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని   విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల   అజ్ఞాతంలోనే  ఉన్నారు.   

Misir Besra arrested, CPI Maoist Politburo member, Jharkhand Maoist arrest, Rs 1 crore reward Maoist, CRPF CoBRA operation, Naxalite commander captured

By
en-us Political News

  
జెన్‌ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
నువ్వు చాలా బాగా ప‌నిచేస్తున్నావు.. శెహ‌భాష్‌..లోకేష్‌` అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్ర‌తిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.