వనస్థలిపురంలోని హరిత వనస్థలి పార్క్లో ఉన్న అనన్య రిసార్ట్ పై రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండ సురేఖ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిసార్ట్ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన మంత్రి అధికారుల సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా రిసార్ట్లోని టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్, కాటేజీలు, కిచెన్ వంటి ప్రాథమిక సదుపాయాలు సరిగా నిర్వహించకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్శకులకు కనీస వసతులు కూడా కల్పించకుండా రిసార్ట్ను నిర్లక్ష్యంగా నిర్వహించడం తీవ్రంగా తప్పుబట్టారు. ఈ రిసార్ట్ను గత పదేళ్లుగా ఒక ప్రైవేట్ సంస్థ లీజ్కు తీసుకుని నిర్వహిస్తోంది.
అయితే ఈ కాలంలో ప్రభుత్వంకు చెల్లించాల్సిన పన్నులు కూడా సరిగా చెల్లించలేదని వెల్లడైంది. పదేళ్ల కాలంలో కేవలం ఒక్క సారి మాత్రమే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించినట్లు అధికా రులు మంత్రికి వివరించారు. అంతేకాకుండా రిసార్ట్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు కూడా అకౌంట్ ద్వారా చెల్లించకుండా నగదుగా ఇస్తున్నట్లు తెలుసుకున్న మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో రిసార్ట్ను ప్రైవేట్ వ్యక్తుల నుండి అటవీశాఖ స్వాధీనం చేసుకుని అభి వృద్ధి పనులు చేపడతామని మంత్రి కొండ సురేఖ తెలిపారు. హరిత వనస్థలి పార్క్ను ప్రజలకు మరింత ఆకర్షణీయంగా తీర్చిది ద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఫారెస్ట్ ఉన్నతా ధికారులు, సిబ్బంది ఈ తనిఖీలో మంత్రికి వెంట ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-surekha-conducts-surprise-inspections-at-ananya-resort-36-215247.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.