Publish Date:Apr 26, 2022
మొన్నటి దాకా వారు బద్ధ శత్రువులు. నేడు ఒక్కటయ్యారు. ఒకరు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మరొకరు తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ వద్ద పంచాయితీ జరిగిన తర్వాత ఏమైందో ఏమో.. అనిల్ కుమార్ ఇంటికి మంగళవారం మంత్రి కాకాణి స్వయంగా వెళ్లారు. అనిల్ ను శాలువాతో సన్మానించారు. తన ఇంటికి వచ్చిన కాకాణిని అనిల్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. దీంతో వారి మధ్య పొడసూపిన విభేదాలు పటాపంచలయ్యాయా? జగన్ వారికి ఇచ్చిన ఆదేశాలు ఫలించాయా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
నిజానికి మంగళవారం ఉదయం కూడా మీడియా సమావేశంలో అనిల్ పరోక్షంగా ఫ్లెక్సీల గురించే వ్యాఖ్యలు చేశారు. అయితే.. సాయంత్రానికి తమలో విభేదాలు లేవంటూ యూ టర్న్ తీసుకున్నారు. కాకాణి- అనిల్ మధ్య విభేదాలు ఫ్లెక్సీలు చింపే వరకు వెళ్లాయి. ప్రమాణస్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని ఒకరంటే.. పంపానని మరొకరు మీడియా ముందు చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దర్నీ తాడేపల్లి పిలిపించి తన శైలిలో మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా గతం.
మంగళవారం సాయంత్రం అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో ఉన్నారని సమాచారం అందగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి భేషజాలకు పోకుండా నేరుగా అనిల్ నివాసానికి వెళ్లారు. మంత్రి కాకాణి రాగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. ఇరువురు ఆప్యాయంగా పలకరించుకుని సుమారు పదిహేను నిమిషాలసేపు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. వారి మధ్య విభేదాలు గాలిబుడగల్లా తేలిపోయాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వారు అనడం కొసమెరుపు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-kakani-went-to-anil-house-25-135022.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.