Publish Date:Apr 26, 2022
మొన్నటి దాకా వారు బద్ధ శత్రువులు. నేడు ఒక్కటయ్యారు. ఒకరు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మరొకరు తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ వద్ద పంచాయితీ జరిగిన తర్వాత ఏమైందో ఏమో.. అనిల్ కుమార్ ఇంటికి మంగళవారం మంత్రి కాకాణి స్వయంగా వెళ్లారు. అనిల్ ను శాలువాతో సన్మానించారు. తన ఇంటికి వచ్చిన కాకాణిని అనిల్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. దీంతో వారి మధ్య పొడసూపిన విభేదాలు పటాపంచలయ్యాయా? జగన్ వారికి ఇచ్చిన ఆదేశాలు ఫలించాయా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
నిజానికి మంగళవారం ఉదయం కూడా మీడియా సమావేశంలో అనిల్ పరోక్షంగా ఫ్లెక్సీల గురించే వ్యాఖ్యలు చేశారు. అయితే.. సాయంత్రానికి తమలో విభేదాలు లేవంటూ యూ టర్న్ తీసుకున్నారు. కాకాణి- అనిల్ మధ్య విభేదాలు ఫ్లెక్సీలు చింపే వరకు వెళ్లాయి. ప్రమాణస్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని ఒకరంటే.. పంపానని మరొకరు మీడియా ముందు చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దర్నీ తాడేపల్లి పిలిపించి తన శైలిలో మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా గతం.
మంగళవారం సాయంత్రం అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో ఉన్నారని సమాచారం అందగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి భేషజాలకు పోకుండా నేరుగా అనిల్ నివాసానికి వెళ్లారు. మంత్రి కాకాణి రాగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. ఇరువురు ఆప్యాయంగా పలకరించుకుని సుమారు పదిహేను నిమిషాలసేపు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. వారి మధ్య విభేదాలు గాలిబుడగల్లా తేలిపోయాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వారు అనడం కొసమెరుపు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-kakani-went-to-anil-house-25-135022.html
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.