Publish Date:Apr 26, 2022
మొన్నటి దాకా వారు బద్ధ శత్రువులు. నేడు ఒక్కటయ్యారు. ఒకరు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మరొకరు తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ వద్ద పంచాయితీ జరిగిన తర్వాత ఏమైందో ఏమో.. అనిల్ కుమార్ ఇంటికి మంగళవారం మంత్రి కాకాణి స్వయంగా వెళ్లారు. అనిల్ ను శాలువాతో సన్మానించారు. తన ఇంటికి వచ్చిన కాకాణిని అనిల్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. దీంతో వారి మధ్య పొడసూపిన విభేదాలు పటాపంచలయ్యాయా? జగన్ వారికి ఇచ్చిన ఆదేశాలు ఫలించాయా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
నిజానికి మంగళవారం ఉదయం కూడా మీడియా సమావేశంలో అనిల్ పరోక్షంగా ఫ్లెక్సీల గురించే వ్యాఖ్యలు చేశారు. అయితే.. సాయంత్రానికి తమలో విభేదాలు లేవంటూ యూ టర్న్ తీసుకున్నారు. కాకాణి- అనిల్ మధ్య విభేదాలు ఫ్లెక్సీలు చింపే వరకు వెళ్లాయి. ప్రమాణస్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని ఒకరంటే.. పంపానని మరొకరు మీడియా ముందు చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దర్నీ తాడేపల్లి పిలిపించి తన శైలిలో మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా గతం.
మంగళవారం సాయంత్రం అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో ఉన్నారని సమాచారం అందగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి భేషజాలకు పోకుండా నేరుగా అనిల్ నివాసానికి వెళ్లారు. మంత్రి కాకాణి రాగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. ఇరువురు ఆప్యాయంగా పలకరించుకుని సుమారు పదిహేను నిమిషాలసేపు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. వారి మధ్య విభేదాలు గాలిబుడగల్లా తేలిపోయాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వారు అనడం కొసమెరుపు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-kakani-went-to-anil-house-25-135022.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.