Publish Date:Apr 26, 2022
మొన్నటి దాకా వారు బద్ధ శత్రువులు. నేడు ఒక్కటయ్యారు. ఒకరు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మరొకరు తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ వద్ద పంచాయితీ జరిగిన తర్వాత ఏమైందో ఏమో.. అనిల్ కుమార్ ఇంటికి మంగళవారం మంత్రి కాకాణి స్వయంగా వెళ్లారు. అనిల్ ను శాలువాతో సన్మానించారు. తన ఇంటికి వచ్చిన కాకాణిని అనిల్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. దీంతో వారి మధ్య పొడసూపిన విభేదాలు పటాపంచలయ్యాయా? జగన్ వారికి ఇచ్చిన ఆదేశాలు ఫలించాయా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
నిజానికి మంగళవారం ఉదయం కూడా మీడియా సమావేశంలో అనిల్ పరోక్షంగా ఫ్లెక్సీల గురించే వ్యాఖ్యలు చేశారు. అయితే.. సాయంత్రానికి తమలో విభేదాలు లేవంటూ యూ టర్న్ తీసుకున్నారు. కాకాణి- అనిల్ మధ్య విభేదాలు ఫ్లెక్సీలు చింపే వరకు వెళ్లాయి. ప్రమాణస్వీకారానికి తనకు ఆహ్వానం పంపలేదని ఒకరంటే.. పంపానని మరొకరు మీడియా ముందు చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దర్నీ తాడేపల్లి పిలిపించి తన శైలిలో మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా గతం.
మంగళవారం సాయంత్రం అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో ఉన్నారని సమాచారం అందగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి భేషజాలకు పోకుండా నేరుగా అనిల్ నివాసానికి వెళ్లారు. మంత్రి కాకాణి రాగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. ఇరువురు ఆప్యాయంగా పలకరించుకుని సుమారు పదిహేను నిమిషాలసేపు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. వారి మధ్య విభేదాలు గాలిబుడగల్లా తేలిపోయాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వారు అనడం కొసమెరుపు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-kakani-went-to-anil-house-25-135022.html
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.