ఆత్మహత్య చేసుకొంటానంటూ కడపలో వివేకా హడావుడి

Publish Date:Feb 20, 2013

Advertisement

 

ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, వ్యవసాయశాఖ మంత్రిగా పదవిని కూడా పొందిన వైయస్. వివేకానందరెడ్డి తన వ్యవసాయ శాఖకి, అది ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి మేలు చేసారో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం కడప డిసిసిబి కార్యాలయం వద్ద నిలబడి, వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తున్నారు.

 

పోలింగ్ అధికారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయడంతో, ఈ రోజు ఉదయం జరుగవలసిన డిసిసిబి ఎన్నికను ప్రభుత్వం వాయిదావేసింది. కడప సహకార ఎన్నికలలో పూర్తిగా పైచేయి సాదించిన జగన్ మోహన్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలే పోలింగు అధికారిని ఎత్తుకుపోయి ఎన్నికలు జరగకుండా అడ్డుకొంటున్నారని ఆరోపిస్తున్నారు.

 

దానికి తోడూ కమలాపురం కాంగ్రెస్ యం.యల్.ఏ. వీర శివారెడ్డి కుమారుడు కూడా పోటీలో ఉండటంతో, ఆయన ఉదయం డిసిసిబి కార్యాలయానికి వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన పైకి చెప్పులు విసరడం, ఆయన వారిపై, తోటి కాంగ్రెస్ మంత్రులపై నది రోడ్డు మీద చిందులు వేయడం వంటి సంఘటనలతో, ఉదయం నుండి అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

ఇప్పుడు, మంత్రి వైయస్. వివేకానంద రెడ్డి కూడా వారికి తోడయి వెంటనే ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని కిరణ్ కుమార్ రెడ్డికి హెచ్చరిక జారీ చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. డిసిసిబి ఎన్నికలలో తనకనుకూలంగా తీర్పు రానందున ఎన్నికల అధికారి లేరనే సాకుతో ఎన్నికలను వాయిదా వేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసయిన సరే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు తను ఆత్మహత్యకు కూడా సిద్దమేనని మంత్రి వివేకానంద రెడ్డి ప్రకటించారు.

 

అయితే, ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. బహుశః ఆయన ఒత్తిడికి తలొగ్గి అర్ధరాత్రయినా సరే, ఈ రోజే డిసిసిబి అధ్యక్ష పదవికి ఎన్నిక జరిపించే అవకాశం ఉంది.

 

ఈ సంఘటనతో, ఇంతవరకు ఆయనకూ, జగన్ మోహన్ రెడ్డికి అసలుపడదంటూ, వివేకానంద రెడ్డి అనుచరులు చేస్తున్న ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించి, ఇక నేదో రేపో జగన్ మోహన్ రెడ్డి వైపు ఫిరాయించేందుకు సిద్దం అయ్యారని భావించవలసి ఉంటుంది.

By
en-us Political News

  
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.