Publish Date:May 15, 2024
ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడతాయి. ఆ లోగా ఏ పార్టీని విజయం వరిస్తుందన్న అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంతే అంత కంటే ముందు రాష్ట్రంలో విజయం తెలుగుదేశం కూటమిదా? వైసీపీదా అన్న విషయాన్ని సాధికారికంగా ఎవరూ చెప్పే అవకాశం లేదు. షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన డజనుకు పైగా సర్వేలు తెలుగుదేశం కూటమిదే విజయం అని తేల్చిసినట్లు ఫలితాలు వెలువరించినా.. వాటిని వేటినీ కచ్చితమైన ఫలితంగా పరిగణించలేము.
అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నా పలు ప్రసిద్ధ సర్వే సంస్థలను ఉటంకిస్తూ సామాజిక మాధ్యమంలో ఫలానా పార్టీదే విజయం, ఫలానా పార్టీకి ఘోర పరాజయం తథ్యం అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా పోస్టుల్లో ఉటంకించిన సంస్థలేవీ వాటిని నిర్ధారించడం లేదు. తమ సంస్థే ఈ సర్వే నిర్వహించిందని అంగీకరించడం కానీ, ఖండించడం కానీ చేయడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున కాంట్రాక్టులు వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ టైకూన్ అని చెప్పదగ్గ మేఘా కృష్ణారెడ్డి చేయించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలుగా చెబుతూ సామాజిక మాధ్యమంలో ఏపీ ఔట్ కమ్ పై పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా మేఘా కృష్ణారెడ్డి చేయించిన సర్వే ఫలితం అంటూ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న నివేదిక ప్రకారం ఏపీలో అధికారం చేపట్టబోయేది కూటమి ప్రభుత్వమే. అయితే దీనికి ఎలాంటి సాధికారతా లేదన్నది పక్కన పెడితే..
మేఘా కృష్ణారెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు కీలక కాంట్రాక్టులను దక్కించుకున్న వ్యక్తి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తం. అదే విధంగా ఏపీలో కూడా జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పుణ్యమా అని పోలవరం వంటి భారీ కాంట్రాక్టును కూడా దక్కించుకున్నారు. అటువంటి మేఘా కృష్ణారెడ్డి చేయించినట్లుగా చెబుతున్న సర్వే ఫలితం తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. తన పేరుపై సర్క్యులేట్ అవుతున్న సర్వే రిపోర్టుపై మేఘా ఇప్పటి వరకూ ఖండించనూ లేదు, సమర్ధించనూ లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/megaha-krishnareddy-survey-say-tdp-alliance-power-39-176077.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.