Publish Date:May 15, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి, ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి కలిగిస్తున్నది కడప లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడప లోక్ సభ నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
గత రెండు ఎన్నికలలో అంటే 2014, 2019 ఎన్నికలలో వైసీపీ ఆధిపత్యం కొనసాగిన కడపలో షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగడంతో వైసీపీ ఆధిపత్యానికి భారీగా గండి పడింది. గత రెండు ఎన్నికలలో కూడా షర్మిల వైసీపీ విజయం కోసం శ్రమించారు. ప్రచారం చేశారు. ఆ రెండు ఎన్నికలలో వైఎస్ కుటుంబం ఏకతాటిపై నిలిచి వైసీపీకి అండగా నిలిచారు. అయితే ప్రస్తుతానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైఎస్ కుటుంబం మొత్తం షర్మిల వెనుక నిలబడింది.
వీటన్నిటి కంటే ప్రధానంగా చెప్పుకోవలసింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ అన్న జగన్ పై వార్ ప్రకటించిన షర్మిలకు, వివేకా కుమార్తె డాక్టర్ సునీత అండగా నిలిచారు. దీంతో కడప లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. షర్మిల విమర్శలు, ప్రశ్నల ధాటికి ఉక్కిరిబిక్కిరై.. వాటిని అడ్డుకునేందుకు కడప కోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో షర్మిల సెంటిమెంట్ ను ఆశ్రయించారు. వైఎస్ బిడ్డను కొంగుచాచి అడుతున్నా అంటే ఓటర్లకు చేసిన అభ్యర్థన కడప వాసుల హృదయాలను నేరుగా తాకిందని విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని అర్థం చేసుకున్న జగన్ చెల్లెలి చీర రంగును సైతం కామెంట్ చేస్తూ షర్మిల తెలుగుదేశం పలుకులు పలుకుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కడపలో వైసీపీకి తీరని నష్టం చేకూర్చాయి. పార్టీలకు అతీతంగా షర్మిలకు మద్దతు వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నియోజవర్గంలో పోలింగ్ సరళిని నిశితంగా గమనించిన పరిశీలకులు కడప ఓటర్లు షర్మిలకే జై కొట్టారని విశ్లేషిస్తున్నారు. అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం ఓట్లు లోక్ సభ స్థానానికి వచ్చేసరికి షర్మిలకు, అసెంబ్లీ స్థానం వరకూ సొంత పార్టీకీ పడ్డాయని అంటున్నారు. అదే వాస్తవమైతే కడపలో షర్మిల విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kadapa-voter-favours-sharmila-39-176080.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.