Publish Date:Feb 28, 2025
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి హోదాలో మీనాక్షి నటరాజన్ తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టారు. రైలు మార్గం ద్వారా ప్రయాణమై వచ్చిన ఆమె శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆమెకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయనతో పాటు ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రాచమల్లు సిద్ధేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు మీనాక్షికి స్వాగతం పలికారు. అయితే మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. హంగు ఆర్భాటాలకు తాను దూరం అని రాష్ట్ర నేతలకు మీనాక్షి నటరాజన్ ఇప్పటికే సమాచారం ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆమె సాధారణ రీతిలో హైదరాబాద్ కు రావడం ఆసక్తిగా మారింది.
ఢిల్లీ దూతగా వస్తున్న మీనాక్షి నటరాజన్ ఫ్లైట్ లో కాకుండా రైలులో రావడం తన లగేజీ బ్యాగ్ ను తనే మోసుకుంటూ తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలతో ముచ్చటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గల్లీ స్థాయి లీడర్లే హంగు ఆర్భాటాలతో హడావుడి చేస్తున్న ఈ రోజుల్లో రాహుల్ గాంధీ టీమ్ లో కీలక సభ్యురాలు, మాజీ ఎంపీ, తెలంగాణలో అధికార పార్టీకి ఇన్ చార్జిగా ఉంటూ మీనాక్షి నటరాజన్ మాత్రం తాను చెప్పినట్లుగా ఆర్భాటాలకు దూరంగా సాధారణంగానే తన పర్యటన కొనసాగిస్తుండటంతో మేడం సింప్లిసిటీ ఇటు పార్టీలో అటు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది.
ఇక తన పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు, గోడ పత్రికలు ఏర్పాటు చేయవద్దని తనకు ఏసీ రూమ్ లు, హోటల్స్ వద్దని రాష్ట్ర నేతలకు ఆమె ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ టూర్ లో భాగంగా ప్రభుత్వ అతిథి గృహం దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్నారు. ఇక హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/meenakshi-natarajan-simplicity-39-193621.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు