సజ్జల, జగన్ మధ్య మావిగన్ చిచ్చు.!

Publish Date:Jul 9, 2026

Advertisement

వైపీపీలో అంతర్గత పరిణామాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి.  2024 అసెంబ్లీ   ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. దీనికి తోడు జగన్ తీరుతో పార్టీలోని సీనియర్ నాయకులు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకే కాదు.. చివరాఖరికి అధినేత జగన్ కు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు  పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా   ప్రచారం సాగుతోంది. అధినేత జగన్ ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సజ్జల పూర్తిగా విఫలమవుతున్నారని,జగన్ ఆయనపై   తీవ్ర అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం.  

ఈ వివాదానికి  కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన  మావిగన్ అంటున్నారు. మావిగన్ ప్రతిపాదనను పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సజ్జల రామకృష్ణారెడ్డి  విఫలమయ్యారని జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. సొంత మీడియాలో కూడామావిగన్ అంశానికి ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కకపోవడం జగన్ కు మింగుడుపడలేదు. మావిగన్ ను  సొంత మీడియా కూడా పట్టించుకోకపోవడం వెనుక  ఉన్నారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

మూడు రాజధానుల స్టాండ్ కారణంగా ప్రజాదరణ, ప్రజా విశ్వాసాన్నీ కోల్పోయామనీ, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ ప్రజజల్లోకి వెడితే ప్రతికూలత మరింత ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో..   సజ్జల, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావించారనీ, అవే సంకేతాలను క్షేత్రస్థాయికి కూడా పంపారనీ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడే.. జగన్ కు తన ఆదేశాలను కాదని సజ్జల స్వతంత్రంగా వ్యవహరించడం రుచించలేదు. తీవ్ర ఆగ్రహానికి లోనై సజ్జలను ఒకింత తీవ్రంగానే మందలించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా,  పార్టీ సమన్వయకర్తగా, సకల శాఖల మంత్రిగా ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ  సర్వస్వం తానే అన్నట్లుగా సజ్జల వ్యవహరించారు.  ఆయన కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే ఈ ఆధిపత్యం పార్టీలోని సీనియర్ నేతలకు అస్సలు నచ్చలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా.. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి సజ్జల అనుసరించిన ఏకపక్ష విధానాలే కారణమని సీనియర్లు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి వంటి   కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డే  కారణమంటూ జగన్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ జగన్ సజ్జలపై నమ్మకం ఉంచారు. కానీ మావిగన్.. విషయంలో సజ్జల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.   దీంతో సజ్జల కూడా పార్టీ వ్యవహారాలలో ఇక నుంచి అంటీ ముట్టనట్లు వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి మధ్య ఈ విభేదాలు పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయా అన్న ఆందోళన వైసీపీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. 

YSRCP Latest News, Mavigan Capital AP, YSRCP Internal Cold War

By
en-us Political News

  
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.