Publish Date:Aug 12, 2022
బస్సుల్లో, ఆటోల్లో చాలాసార్లు మనం చాలాసార్లు రూపాయి, రెండురూపాయలు వదిలేస్తూ ఉంటాం. చిల్లర లేదని డ్రైవర్లు నొక్కేస్తుంటారు. కానీ తుంగనాధ్ చతుర్వేదీ ఇరవై రూపాయల కోసం ఏకంగా రైల్వే వారిని కన్స్యూమర్ కోర్టుకు ఈడ్చాడు. ఇరవయ్యేళ్లు కేసు నడిచిన తర్వాత ఆయనకు రూ.15000 చెల్లించమని కోర్టు ఆదేశించింది. దేశంలో కన్స్యూమర్ చట్టం అంటూ ఒకటి ఉందని చాలామంది ఇప్ప టికైనా తెలుసు కుంటే మంచిది.
చతుర్వేది అనే లాయరు 1999లో మధురనుంచి మొరాదాబాద్కు రైల్లో వెళ్లారు. టిక్కెట్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. అప్పట్లో మధుర నుంచి మొరాదాబాద్కు టిక్కెట్ 35 రూపాయలు. కానీ బుకింగ్ కౌంటర్ లో ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఆయన వందరూపాయలు ఇస్తే 70 రూపాయలు తీసుకోవా ల్సింది 90 రూపాయలు తీసుకుని పది రూపాయలు ఇచ్చారు. చతుర్వేది రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే భయ్యా, జర లైట్ తీసుకో అన్నారట. ఆయనకి కోపం వచ్చింది. అంతే వెంటనే ఈశాన్య రైల్వే బుకిం గ్ క్లర్క్ మీద కన్స్యూమర్ కోర్టులో కేసు వేశారు. వందకు మించి కోర్టు వాదనలు జరిగాయి. అన్ని రోజు లు అన్నిసార్లూ చతుర్వేది కోర్టుకు వెళ్లారు. ఆయన నిజానికి అంత ఆరోగ్యవంతుడు కాదు. అయినా రైల్వే క్లర్కుకు, రైల్వే వారికి బుద్ధిచెప్పాలన్న పట్టుదలతోనే చాలా సహనం ప్రదర్శించారు.
ఈ కేసు 22 ఏళ్లు నడిచింది. చివరికి సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన ఒక కేసు తీర్పు ఆధారంగా ఇలాంటి కేసులు కన్స్యూమర్ కోర్టు తీర్పు ఇవ్వచ్చని తేలింది. అంతే రైల్వేవారికి గుండెల్లో రాయి పడింది. అసలు అప్పుడే ఆ ఇరవై రూపాయలు ఇచ్చుంటే సరిపోయేది. ఏదో ముసలాయన కదా ఏం చేస్తాడులే అని క్లర్కు లు దబాయించారు. కానీ కన్స్యూమర్ కోర్టు తీర్పు తాటతీసింది. చతుర్వేదీకి వడ్డీతో సహా 15000 నెల రోజుల లోపు చెల్లించాలని ఆదేశించింది. మొనగాడంటే ఈడ్రా బుజ్జీ అన్నారు మధుర వారంతా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mathura-man-won-case-against-rlys-25-141813.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.