పెళ్లయ్యాక మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోకపోతే జరిగే నష్టాలు ఇవే..!

Publish Date:Feb 19, 2025

Advertisement

 

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చట్టపరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.  ఇదివరకు పెళ్లి అనేది పెద్దల నిర్ణయం తో ముడి పడి.. పలువురిని ఆహ్వానించి అందరి ఆశీర్వాదాల మధ్య జరిగేది.  ఇప్పుడు కూడా ఇలానే జరుగుతున్నా అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు వచ్చాయి.  పెళ్లికి చట్టపరమైన భద్రత ఏర్పరిచారు. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారు.  అయితే చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు.  అసలు మ్యారేజ్ సర్ఠిఫికేట్ వల్ల కలిగే లాభాలు ఏంటి? పెద్దల సమక్షంలో అందరి అంగీకారంతో పెళ్ళి జరిగినా, ప్రేమ వివాహాలు చేసుకున్నా ప్రతి జంట మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటారు ఎందుకు? దీని వెనుక గల కారణాలు ఏంటి? తెలుసుకుంటే..

వివాహ ధృవీకరణ పత్రం..

పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందుకోసం వివాహ పత్రిక,  పెళ్లి సమయంలో తీయించుకున్న ఒక ఫొటో ప్రభుత్వానికి సమర్పించాలి.  ఇవన్నీ చూశాక ప్రభుత్వం ఆ జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తుంది.  ఇది పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ బంధం గురించి భరోసా ఇస్తుంది.  ఇందులో ఎవరూ మోసపోయే అవకాశం లేకుండా చేస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల మరిన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి.

ఇప్పటి భార్యాభర్తలు భవిష్యత్తు మీద చాలా ప్లానింగ్ తో ఉంటున్నారు.  భార్యాభర్తలు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసే వారు అయితే వారు విదేశాలకు వెళ్లాలనే ప్లానింగ్ తో ఉంటే వారికి తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి.  మ్యారేజ్ సర్టిఫికెట్ లేని పక్షంలో వారికి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి.

వివాహ ధృవీకరణ పత్రం లేకుండా బ్యాంకు డిపాజిట్లు,  జీవిత భీమా, భీమా సౌకర్యాలు,  బ్యాంకు లోన్లు తదితర ప్రభుత్వ,  ప్రైవేటు ప్రయోజనాలు పొందలేరు.  అది చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా నామినీ పేరు నమోదు కాకపోతే చాలా సమస్యగా మారే అవకాశం ఉంటుంది.

మహిళలకు మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా అవసరం.  ఒకవేళ భర్త మరణిస్తే అతనికి సంబంధించిన ఆస్తులపై తన హక్కులను క్లెయిమ్ చేయాలని అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.  అది లేకపోతే భర్తకు సంబంధించిన ఆస్తులపై హక్కుల కోసం ఆమే చాలా పోరాడాల్సి వస్తుంది.

పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు లేదా వివాదాలు ఏర్పడితే.. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా దాన్ని గెలిపించుకోవడం కష్టం.  ఆ వివాహం చెల్లుబాటును సవాలు చేయవచ్చు.  రిజిస్ట్రేషన్ లేకుండా సరైన ఆధారాలు లేని వివాహాలను ప్రభుత్వం చట్టవిరుద్ధమైనవిగా సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది కూడా. కాబట్టి ఇప్పట్లో వివాహాల చెల్లుబాటుకు సరైన ఆధారాలు, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి.

కొన్ని సార్లు వివాహం పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మోసపోతుంటారు.  వివాహం అనంతరం మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా.. సరైన ఆధారాలు లేకుండా చేసి వారిని మోసం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి మోసాలలో ఎక్కువగా నష్టపోతుంటారు. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డు కట్ట వేయవచ్చు.


                                                *రూపశ్రీ.
 

By
en-us Political News

  
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.