తెలుగుదేశం వైపు మర్రి రాజశేఖర్ చూపు!

Publish Date:Mar 21, 2025

Advertisement

వైసీపీ భవిష్యత్ పట్ల ఆ పార్టీ నాయకులు ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీ కీలక నేతలంతా జగన్ కు దూరం జరుగుతూ పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బుధవారం (మార్చి 20) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీని కూడా వీడతాననీ, తన కార్యకర్తలతో చర్చించి తెలుగుదేశం గూటికి చేరతాననీ ప్రకటించారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఇప్పటి వరకూ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. మర్రి రాజశేఖర్ కంటే ముందు పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంటకరమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు తాజాగా రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే.. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన వైసీపీ తరఫున విజయం సాధించారు. చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఇండిపెండెంట్ గా విజయం సాధించిన మర్రి, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో చిలకలూరి పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు.  ఇక 2019 ఎన్నికలలో ఆయన చిలకలూరి పేట నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019లో చిలకలూరి పేట స్థానం నుంచి విడదల రజనీని జగన్ రంగంలోకి దింపారు. అప్పట్లోనే తీవ్ర అసంతృప్తికి లోనైనా మర్రి రాజశేఖర్.. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, కేబినెట్ లోకి తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు.  

అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ ఇచ్చిన హామీ మేరకు మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, కేబినెట్ లోకి తీసుకోలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం 2023 వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికలలో మర్రికి టికెట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మర్రి రాజశేఖర్ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. కాగా రాజీనామా చేయవద్దంటూ జగన్ రాయబారాలు పంపినా మర్రి ఖాతరు చేయలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా మర్రి రాజీనామా చేయవద్దంటూ ఎన్ని విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.  

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.